ఏ2డిజిటల్ న్యూస్, మే6,చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

కామారం తండా లో ఉపాధి హామీ పనులతో పాటు నర్సరీ, ఇందిరమ్మ ఇండ్లను, మరియు వడ్ల కొనుగోలు కేంద్రాలను బుధవారం ఎంపీడీవో దామోదర్ పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉపాధి పనుల ప్రదేశం వద్ద వెళ్లి ఉపాధి కూలీలతో మాట్లాడారు. గ్రామంలోని నర్సరీ ని సందర్శించి మొక్కలకు నీరు పాడిన చాలని తెలిపారు. మొక్కలు ఎండ వేడిమి కి వాడిపోకుండా చుట్టూ కంచె వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ హలవత్ మోహన్ నాయక్, పంచాయతీ సెక్రటరీ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

