ఏ2డిజిటల్ న్యూస్, మే 7, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

కొల్చారం మండలం పోతాం శెట్టిపల్లిలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జరిగిన రైతు వరము సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు.అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ దేశం వ్యవసాయ ఆధారిత దేశమని, రైతులు వ్యవసాయంలో నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆధునిక వంగడాలు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను వినియోగించడం ద్వారా పంటల ఉత్పత్తిని పెంచుకోవచ్చన్నారు. రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, స్థానిక తహసిల్దార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

