ఏ2డిజిటల్ న్యూస్, మే8, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
మెదక్ మున్సిపాలిటీ లోని ఆరో వార్డు జమ్మికుంట కాలనీలో టి యు ఎఫ్ ఐ డి సి, ఎస్ డి ఎఫ్, ఎస్ బి ఎం పథకాల కింద మంజూరైన 39 లక్షల 50 వేల రూపాయల సిసి రోడ్డు పనులను స్థానిక వార్డు కౌన్సిలర్ కొడకంటి హరిత ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులను మెదక్ ఎమ్మెల్యే బైనంపల్లి రోహిత్ రావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. అనంతరం కమ్యూనిటీ హాల్లో బోరు మోటార్ ప్రారంభించారు. స్థానిక కౌన్సిలర్ కొడకంటి హరిత ఆధ్వర్యంలో జరిగినఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాధర్, సుభాష్ చంద్రబోస్, సంఘశ్రీకాంత్,రామస్వామి,ముజాంబిల్ ,సిద్ధిరాములు ,పింకు, రింకు, ప్రేమ్ సాగర్ , సుమన్ కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

