ఏ2డిజిటల్ న్యూస్, మే 8, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
రైతులు ఉచిత పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని రంగంపేట పశువైద్యాధికారిని డాక్టర్ ప్రియాంక అన్నారు.శుక్రవారం మండలకేంద్రమైన కూల్చారం హాస్పిటల్ ఆవరణలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పశుగణాభివృద్ది సంస్థ మెదక్ మరియు కూల్చారం పశువైద్య, పశుసంవర్ధక వారి అద్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పశువైద్యదికారిని ప్రియాంక మాట్లాడుతూ పశు పోషకులు వేసవిలో పశువులకు వడ దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏవైనా పశువులు అనారోగ్యంతో ఉన్నట్లు అయితే వెంటనే తమ సిబ్బంది కి తెలపాలని అన్నారు.ఈ రోజు నిర్వహించిన శిబిరంలో 10 ఉచిత కృత్రిమ గర్భధారణ,28 దూడలకు నట్టాల నివారణకు మందులు త్రాగించడం,20 గర్భకోశ వ్యాధులను గుర్తించి చికిత్స,సాధారణ చికిత్సలు 14 పశువులకు చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దేవన్నగారి శేఖర్ మాట్లాడుతూ.. పశుసంవర్ధక శాఖ అద్వర్యం లో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని తమ పశువులను కాపాడుకోవాలని,ఏవైనా సమస్యలు ఉంటే పశువైద్యులకు తెలియజేయాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కోరంపల్లి రాణి గోపి లైవ్ స్టాక్ అసిస్టెంట్ చెన్నయ్య, వెటర్నరీ అసిస్టెంట్ కీర్తి,సిబ్బంది మహిపాల్, గోపాల మిత్ర ప్రవీణ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

