ఏ2డిజిటల్ న్యూస్, మే9, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలోని రంగంపేట గ్రామ వి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు దుర్గం విట్టల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు, చేయి ఫ్రాక్చర్ కాగా విషయాన్ని తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శుక్రవారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆసుపత్రి ఖర్చులను యిప్పించడం జరుగుతుందని వారికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్, మండల పార్టీ యువత విభాగం అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు, కార్యకర్తలు ముల్లెల ఆంజనేయులు, ఉషికే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

