
ఏ2 డిజిటల్ న్యూస్, మే9, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
చేగుంట మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో శనివారం సెన్సెస్–2027 తొలి దశలో భాగంగా మే 11 నుంచి ప్రారంభం కానున్న ఇండ్ల గణనపై గ్రామస్థులకు అవగాహన కల్పించినట్లు చేగుంట తహసీల్దార్ శివ ప్రసాద్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు స్వయంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని సూచించారు. ఇండ్ల గణనకు ప్రభుత్వ పథకాలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్యూమరేటర్లకు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించాలని కోరారు.ఆధార్ కార్డు నంబర్ లేదా ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలను చెప్పాల్సిన అవసరం లేదని, కేవలం ఇంటి నంబర్ మరియు ఇంటికి సంబంధించిన వివరాలు మాత్రమే ఇవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ భూమేష్, సర్పంచ్ నర్సింహా, ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

