-అదనపు కలెక్టర్ నాగేష్ కు కృతజ్ఞతలు తెలిపిన రైతులు
ఏ 2 డిజిటల్ న్యూస్, మే11, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేసిన వరి ధాన్యం బస్తాలతో నిలిచిపోయాయని రైతులు వడిగాపులు కాస్తున్నారన్నారు. వార్త ఏ2 డిజిటల్ న్యూస్ లో వచ్చింది.దీనికి స్పందించిన అదనపు కలెక్టర్ నాగేష్ లారీలను సూరారం, అంబాజీపేట, గజగట్లపల్లి, తదితర గ్రామాలకు పంపారు. దీంతో 15 రోజుల కింద కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై తూకంతో నిండిపోగా, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు తూకం వేసిన ధాన్యం సంచులను లారీల్లోకి లోడింగ్ చేస్తున్నారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ అదనపు కలెక్టర్ నాగేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

