కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా మాజీ చైర్మన్ జంగర్ల గోవర్ధన్
ఏ2 డిజిటల్ న్యూస్, మే11, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు మే 12 న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ మంగళవారం నిర్వహించబడుతోందని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ మాజీ చైర్మన్ జంగర్ల గోవర్ధన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్య విలువలకు పెట్టింది పేరని జిల్లా చైర్మన్ కు ఎవ్వరైనా దరఖాస్తు పెట్టుకోవచ్చన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ మైనంపల్లి హన్మంత్ రావ్ ,మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరు కూడా పాల్గొంటారని, జిల్లా చైర్మన్ కావాలనుకునేవారు వారి బయోడేటాతో పాటు దరఖాస్తులను చేతికి అందజేయలని గోవర్ధన్ తెలిపారు.

