Sunday, July 5, 2026

మిషన్ మోడ్‌లో ధాన్యం దిగుమతులు వేగవంతం చేయాలి

రైస్ మిల్లర్ల నిర్లక్ష్యాన్ని సహించం

కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి

కేంద్రాలకు వచ్చే ధాన్యానికి అనుగుణంగా ట్రక్కులు సమకూర్చాలి

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాలు

ఏ2 డిజిటల్ న్యూస్, మే15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో కొనుగోలు చేసిన వరి ధాన్యం దిగుమతి ప్రక్రియను మిషన్ మోడ్‌లో వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం నుండి నిర్వహించిన గూగుల్ మీట్‌లో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ విక్రాంత్ సింగ్, ఆర్డీవోలు, పౌరసరఫరాల శాఖ, సహకార శాఖ, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి అంశాలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నిబంధనల మేరకు కొనుగోళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి కేటాయించిన రైస్ మిల్లులు, గోదాములకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కేంద్రాలకు వచ్చే ధాన్యానికి అనుగుణంగా రవాణా శాఖ అధికారులు సరిపడా ట్రక్కులను సమకూర్చాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిషన్ మోడ్‌లో వేగంగా మిల్లులకు తరలించాలని, దిగుమతుల విషయంలో రైస్ మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.కొనుగోలు కేంద్రాల్లో తూకం, రవాణా, గన్నీ బ్యాగుల సరఫరా, హమాలీల ఏర్పాటు వంటి అంశాల్లో అలక్ష్యం చోటు చేసుకోకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రైస్ మిల్లులు, గోదాములకు చేరిన ధాన్యాన్ని వేగంగా దిగుమతి చేసుకోవాలని, అవసరమైతే హమాలీల సంఖ్యను పెంచుకోవాలని తెలిపారు. కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఆధ్వర్యంలో హమాలీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.రోజుకు కనీసం పది నుంచి పదిహేను లారీల ధాన్యాన్ని దిగుమతి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ధాన్యం రవాణా, దిగుమతి ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో పని చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ గూగుల్ మీట్‌లో జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్, డీఎం పౌరసరఫరాలు జగదీష్, గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular