Sunday, July 5, 2026

రెండు కళ్ళు ను దానం చేసిన తోష శ్రావణ్ కుటుంబీకులు

ఏ2డిజిటల్ న్యూస్, మే 18, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

కుటుంబ కలహాలతో పాయిజన్ తీసుకొని నిన్న మరణించిన తోశ శ్రావణ్ కళ్ళను ఆదివారం గాంధీ ఆసుపత్రిలో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి తన రెండు కళ్ళను దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ …ప్రతి ఒక్కరికి ఈ అవయవ దానంలో అవగాహన కల్పించుకొని మనం మరణించిన గాని మరో నలుగురికి మన ఆర్గాన్స్ తోటి కొత్త జీవితం ఇచ్చేందుకు అందరు కూడా ముందుకు రావాలని ఈరోజు తను చనిపోయిన తన రెండు కాళ్ళను ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కి దానం చేసిన శ్రావణ్ కుటుంబానికి కిష్టాపూర్ గ్రామ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం క్షణికావేశ నిర్ణయాలతో తమ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవద్దని అందరికీ తెలియజేస్తూ ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటదని సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడు కూడా సమస్యలు వచ్చినప్పుడు ధైర్యం కోల్పోయి ప్రాణం తీసుకొని నిన్ను నమ్ముకున్న వాళ్ళను నడిరోడ్లో నిలబెట్టే ఆలోచన నుండి అందరూ కూడా విరమించుకొని తమ జీవితాన్ని సక్రమార్గంలో ఎంచుకొని నలుగురికి ఆదర్శంగా ఉండాలని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిష్టాపూర్ గ్రామ పదవ వార్డు సభ్యుడు తోషా నవీన్ కుమార్ మాజీ వార్డ్ సభ్యులు అరికెల శ్రీనివాస్ అరికెల వసంత ప్రవీణ్ అరికెల ఎగొండ. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు మహేష్ కొల్చారం హెడ్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular