Sunday, July 5, 2026

కదలని ధాన్యం బస్తాలు లారీల కోసం రోడ్ ఎక్కిన రైతన్నలు

17.000 నుంచి 20,000 రూపాయలు ఇస్తేనే లారీ.. ?

అన్నదాతలను ఆగం చేస్తున్న లారీ యూనియన్

ఏ2డిజిటల్ న్యూస్, మే19,సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామ శివారులో ఏడు యలు టీ జంక్షన్ వద్ద సోమవారం ఎన్ హెచ్ 765 డి రహదారిపై సుమారు రెండు గంటల పాటు రైతన్నలు లారీల కోసం రాస్తారోకో నిర్వహించారు.రైతుల రాస్తారోకోతో ఎక్కడ నిలిచిపోయిన వాహనాలు ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు సుమారు 3500 వడ్ల సంచులు తూకం వేసి ఐదు రోజులు గడుస్తున్నా ఒక్క లారీ కూడా రాకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు లారీలు ఎందుకు రావడం లేదని గ్రామ సర్పంచ్ దయాకర్ గౌడ్ లారీ యూనియన్ వాళ్లను నిలదీస్తే బయట మాకు 15000 రూపాయలు ఇస్తున్నారు మీరు 17000 నుంచి 20000 వేల రూపాయలు మాకు డబ్బులు ఇస్తేనే లారీలు వస్తాయంటూ లారీ యూనియన్ వాళ్లు రైతులకు తెలిపారు రైతుల దగ్గర లారీ యూనియన్ వాళ్లు డబ్బులు డిమాండ్ చేస్తే అధికారులు ఏం చేస్తున్నారంటూ రైతన్నలు నిలదీశారు. కనీసం తూకం వేసిన వడ్ల సంచులను కూడా రైస్ మిల్లులకు తరలించలేక పోతున్నారని ఈరోజు లారీలు రాకపోతే రేపు వందల మంది రైతులతో కలిసి నేషనల్ హైవే ఎన్ హెచ్765డి రహదారిపై బైఠాయించి రాస్తారో గంటలపాటు నిర్వహిస్తామని అవసరమైతే కేసులు పెట్టిన మేము వెనుకాడమని రైతన్నలు తెలిపారు. విషయం తెలుసుకున్న కొల్చారం ఎస్ఐ మొహీనుద్దీన్ హుటాహుటిన రైతుల దగ్గరికి వెళ్లి రోడ్డుపై బైఠాయించిన రైతులకు నచ్చజెప్పి లారీలు ఏర్పాటు చేస్తా మని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దయాకర్ మాజీ ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సిద్ధిరాములు యాదయ్య మహిపాల్ దినేష్ దుర్గయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular