ఏ2 డిజిటల్ న్యూస్, మే 18, మనోహరాబాద్ ప్రతినిధి (రామకృష్ణ)
ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో మూడో వార్డులో అండర్ గ్రౌండ్ మోరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజానర్సింహా, ఉప సర్పంచ్ రాంరెడ్డి, పంచాయతీ సెక్రటరీ రమేష్ పాల్గొని పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మోరీ నిర్మాణం చేపడుతున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో సత్యనారాయణ, సలీం, అరుణ్, నాగరాజు, శ్రీకాంత్, జాంగిర్ బాబు తదితరులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

