26,191 మంది రైతుల ఖాతాల్లో రూ.260.03 కోట్లు జమ– జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
ఏ2డిజిటల్ న్యూస్, మే 19, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
జిల్లాలో గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి అత్యంత వేగంగా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 37,072 మంది రైతుల నుంచి 1,85,688.480 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా 26,191 మంది రైతుల ఖాతాల్లో రూ.260.03 కోట్లను నేరుగా జమ చేసినట్లు తెలిపారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు అవసరమైన టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే మిల్లర్లు అన్లోడింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారానే ధాన్యాన్ని విక్రయించాలని కలెక్టర్ రైతులకు సూచించారు.

