
శ్రమదానంతో రోడ్ల మరమ్మతులు – ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ

ఏ2డిజిటల్ న్యూస్, మే22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామాభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ సబిత, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు కలిసి శ్రమదానం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా ఆర్ & బి రోడ్డు వద్ద రామాలయం సమీపంలో మట్టి పనులు చేపట్టి, రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చారు. అలాగే రహదారి సౌకర్యం మెరుగుపడే విధంగా మొరం వేయించారు.గ్రామ ప్రజల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా గ్రామాభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

