Sunday, July 5, 2026

ప్రయోగాల దర్శకున్ని వరించిన కళానంది

ఏ2డిజిటల్ న్యూస్, జూన్ 2, (ప్రత్యేక ప్రతినిధి మల్పర్తి రాంచందర్)

తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాల దర్శకులుగా పేరుపొందిన డాక్టర్ పిసి ఆదిత్యను కళానంది అవార్డు వరించింది. ఆదిత్య కూడా రంగస్థలం నుండి సినీ రంగానికి వచ్చిన వారే.విద్యార్థి దశలో జంధ్యాల గారి ఏక్ దిన్ కా సుల్తాన్, పరుచూరి బ్రదర్స్ నాన్నా పులి, గణేష్ పాత్రో కొడుకు పుట్టాలా, ఆదివిష్ణు గారి వంద నోటు లాంటి ఎన్నో నాటికల్లో నటించి, అనంతరం సొంతం గా నాటికలు రచించి, దర్శకత్వం వహించి, నటించారు. ఈ స్ఫూర్తి తో సినీ రంగం లో అడుగు పెట్టి పలు ప్రయోగాలు చేస్తూ ఎంతో మంది కొత్తవారికి అవకాశాలు ఇస్తూ ఇంకా దర్శకుడు గా తన ప్రయాణం సాగిస్తున్నారు. ఈ అనుభవాన్ని గుర్తించి హైదరాబాద్ త్యాగరాయ గానసభ లో సీనియర్ దర్శకులురేలంగినరసింహారావు, వకులాభరణం కృష్ణ మోహన్ ఫౌండేషన్ అధినేత మాదాల నాగూర్ బాబు దర్శకులు పీసీ ఆదిత్య కళానంది అవార్డు అందజేసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పీసీ ఆదిత్య స్పందిస్తూ తన సినీ విజయాలకు మూలమైన రంగస్థలం ని ఎప్పటికి మరిచిపోనని అన్నారు. ఆదిత్యకు అభిమానులు మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular