Sunday, July 5, 2026

వ్యవసాయ అధికారిపై ఆగ్రహంవ్యక్తం చేసిన తహసిల్దార్

ఏ2డిజిటల్ న్యూస్, జూన్ 2,సీనియర్ జర్నలిస్ట్( బుచ్చన్న)

స్థానిక కొల్చారం మండల వ్యవసాయ అధికారిని శ్వేతా కుమారి వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తాసిల్దార్ శ్రీనివాసచారి. ఈ సందర్భంగా వారు తాసిల్దార్ కార్యాలయంలో ఏవో శ్వేత తాసిల్దార్ శ్రీనివాస్ చారి ముఖముఖిగా మాట్లాడుతూ..స్థానిక మండలంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేసే విషయాన్ని మండల తాసిల్దారు అయినా తనకు తెలపకుండా తనిఖీ చేయడమే పొరపాటు అంతేకాకుండా వ్యవసాయ శాఖకు చెందిన జిల్లా స్థాయి అధికారి వచ్చిన సమయంలో తాను కూడా పాల్గొన్నట్లు మీడియాకు తెల్పడం ఎంతవరకు సమంజసం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనకు ఉందని ఈ సంఘటననుఏవో ఇష్టా రీతికే వదిలేస్తున్నట్లు ఆయన మండిపడ్డారు. ఒకపక్క తాసిల్దార్ జరిగిన సంఘటనపై ప్రశ్నిస్తుంటే తనకేదో అత్యవసర పని ఉన్నట్లుగా ఎమ్మార్వో కార్యాలయం నుండి వెళ్లిపోవడం ఎంతవరకు సమంజసం అనేది గమనార్హం ఇకనుండి ఇలాంటి కార్యకలాపాలకు తమ కిందిస్థాయి అధికారులు ఎవరు పాల్పడితే విధిగా చర్యలు తీసుకోవాల్సింది ఉంటుందని తాసిల్దార్ శ్రీనివాస్ చారి మీడియాతో తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular