సిసి రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్ స్వప్న ఉషయ్య, ఉప సర్పంచ్ నిర్మల శేఖర్ యాదవ్
ఏ2డిజిటల్ న్యూస్, జూన్ 6,సీనియర్ జర్నలిస్ట్ (బుచ్చన్న)
కొల్చారం( 5)మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. సిసి రోడ్డు నిర్మాణం పనుల కొరకు ఎంపీ నిధుల నుండి పది లక్షల రూపాయలు మంజూరు అయినవి అని గ్రామ సర్పంచ్ స్వప్న ఊష య్య తెలిపారు.గ్రామ అభివృద్ధిలో భాగంగా ఒకటవ వార్డు, పదవ వార్డులలో నూతనంగా చేపట్టనున్న 250 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణ పనులు శుక్రవారం గ్రామ సర్పంచ్ స్వప్న ఊష య్య ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలపడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రజల సౌకర్యార్థం రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. నాణ్యత ప్రమాణాలతో ఈ రోడ్డు పనులను గడువులోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ నిధుల నుండి మంజూరు చేయించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు పనులు ప్రారంభం కావడం పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చందాపురం నిర్మల శేఖర్ యాదవ్ , మాజీ సర్పంచ్ తిరునగరి గోదావరి,వెంకటరాములు ,పంచాయతీ సెక్రెటరీ మమత, వార్డు మెంబర్స్ అక్కిం ప్రవీణ్ యాదవ్, తోశ నవీన్, పసుల రేఖ యాదగిరి, నాయకులు ఎంచర్ల శేఖర్ యాదవ్,ఎంబరి శేఖర్ వడ్ల సంతోష్ కుమార్ గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.

