Wednesday, May 6, 2026
Home Blog Page 4

ఆత్మ నిర్భయ పంచాయతీ శిక్షణ శిబిరం –పంచాయతీ ప్రిన్సిపాల్ సెక్రటరీ మీనా కుమారి

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 3,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భయ పంచాయితీ శిక్షణ శిబిరంలో సెక్రెటరీ మీనా కుమారి పాల్గొని మాట్లాడుతూ సాధారణ నిధులతో గ్రామాలు తీర్చిదిద్దాలని పంచాయతీ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రెటరీ మీనకుమారి సర్పంచ్లకు సూచించారు. హైదరాబాదులోని రాజేందర్ నగర్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భయ పంచాయతీ శిక్షణ చిన్న శంకరంపేట సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్ చందంపేట సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు లాస్య స్థాయిలో 60 మంది సర్పంచులకు నిర్భయ పంచాయతీ కార్యక్రమంలో అవకాశం కల్పించినట్లు అందులో నుండి మెదక్ జిల్లా సంబంధించి ఏడు గ్రామపంచాయతీ సర్పంచ్లకు మాత్రమే ఆహ్వానందిందని తెలిపారు సాధన నిధులతో గ్రామాల అభివృద్ధి లో మరిన్ని డబ్బులు వచ్చే విధంగా వ్యాపారాలు తయారు చేసుకొని అభివృద్ధిని ముందంజలో నడపాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ప్రదీప్ పద్మ తదితరులు పాల్గొన్నారు.

వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభం

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 2,చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సర్పంచ్ దివ్య లింగం గౌడ్ ప్రారంభించారు. ఫిజికల్ డైరెక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మడూర్ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 21వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు ఈ శిక్షణ రోజు ఉదయం సాయంత్రం జరుపబడుతుందని తెలిపారు. అనంతరం సర్పంచ్ దివ్య లింగం గౌడ్ మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. వేసవి రోజుల్లో ఉదయం సాయంత్రం రెండు పూటలా క్రికెట్ వాలీబాల్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు క్రీడాకారులు సకాలంలో వచ్చి క్రీడలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ కె కిరణ్ కుమార్, సర్పంచ్ దివ్య లింగ గౌడ్ ఉపసర్పంచ్ యువకులు పాల్గొన్నారు.

నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

0

జిల్లాలో 479 మంది అభ్యర్థులు హాజరుఅభ్యర్థులు హాల్ టికెట్ సూచనలు తప్పనిసరిగా పాటించాలి:జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

ఏ2 డిజిటల్ న్యూస్, మే 1, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో మే 3న నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షను ఎలాంటి చిన్న తప్పిదం కూడా లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఒకే పరీక్షా కేంద్రంలో మొత్తం 479 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సెంటర్ సూపరింటెండెంట్ (సి ఎస్), అబ్జర్వర్లు, తహసిల్దార్ స్థాయి అధికారులు, ఎస్సై, ఒక గన్‌మన్, నలుగురు కానిస్టేబుళ్లతో కూడిన భద్రతా సిబ్బందిని నియమించాలని సూచించారు. కేంద్రాల వద్ద సెక్షన్ 163 బి ఎన్ ఎస్ అమలు చేయడంతో పాటు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, సీసీ కెమెరాలు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు కల్పించాలని, అభ్యర్థులు సకాలంలో చేరేందుకు ఆర్టీసీ బస్సులు సమయానికి నడపాలని పేర్కొన్నారు. దివ్యాంగ అభ్యర్థులకు ప్రత్యేక సదుపాయాలు, ప్రాథమిక వైద్యం, అంబులెన్స్, ఫైర్ సర్వీసులు సిద్ధంగా ఉంచాలని తెలిపారు.పరీక్ష మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 5.00 గంటల వరకు జరుగుతుందని, ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారని, మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఎవరినీ అనుమతించరని స్పష్టం చేశారు.అభ్యర్థులకు సూచనలు:హాల్ టికెట్‌లోని అన్ని సూచనలు తప్పనిసరిగా పాటించాలిసెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గడియారాలు, బ్లూటూత్, బ్యాగులు, కాలిక్యులేటర్లు అనుమతి లేదుఅడ్మిట్ కార్డు, ఫోటో ఐడి ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో తప్పనిసరిమధ్యాహ్నం 1:30 లోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలిమడమలు తక్కువగా ఉన్న చెప్పులు మాత్రమే ధరించాలి (షూస్ నిషేధం)లోహ ఆభరణాలు ధరించకూడదునీట్ పరీక్షను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమగ్ర చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు.

నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్‌గా చెరుకు సాయికుమార్ నియామకం

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 1, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్‌గా గ్రూప్-1 అధికారి చెరుకు సాయికుమార్‌ను ప్రభుత్వం నియమించింది. శుక్రవారం ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్‌ను చెరుకు సాయికుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ మాట్లాడుతూ, నర్సాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు పటిష్ట కార్యాచరణతో పని చేస్తానని తెలిపారు. ఉన్నతాధికారుల మార్గదర్శకత్వంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేస్తానన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, కలెక్టరేట్ అధికారులు, నర్సాపూర్ మున్సిపాలిటీ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

మెదక్ జిల్లాలో మే నెల పొడవున 30 పోలీసు యాక్ట్ అమలు

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 1, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా మే 1 నుండి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ – 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు.ఈ కాలంలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని ఆయన స్పష్టం చేశారు.అలాగే ప్రజల లేదా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక చర్యలు, అశాంతి సృష్టించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. శాంతి భద్రతల నిర్వహణలో ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు శాఖ చేపడుతున్న చర్యలకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

బాల్యవివాహాల నిర్మూలనకు చందంపేట గ్రామసభ తీర్మానం

0

ఏ2డిజిటల్ న్యూస్ మే 1,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

బాల్యవివాహాలు పూర్తిగా అరికడతామని చిన్న శంకరంపేట మండలం చందంపేట సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించి పలకవర్గం గ్రామస్తుల ఆధ్వర్యంలో బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని ఏకగ్రీవ నిర్మాణం చేశారు. సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మా గ్రామంలో మహిళలకు పురుషులకు వివాహం 18 సంవత్సరాలు మరియు 21 సంవత్సరం లోపు వారికి ఎట్టి పరిస్థితుల్లో వివాహాలు జరగనివ్వమని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింలు వార్డు సభ్యులు అంగన్వాడి టీచర్లు ఆశ వర్కర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

డీజీపీ శివధర్ రెడ్డికి ఘన వీడ్కోలు

0

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శివధర్ రెడ్డికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన సహచర ఐపీఎస్ అధికారులతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డికి సాదరంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర పోలీసు శాఖ అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన అందించిన సేవలను కొనియాడారు.శివధర్ రెడ్డి నాయకత్వం పోలీసు శాఖకు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈవ్‌టీజింగ్‌పై షీ–టీమ్స్ ఉక్కుపాదం

0

ఏప్రిల్‌లో 8 ఎఫ్‌ఐఆర్‌లు, 8 ఈ–పెట్టి కేసులు56 మందికి కౌన్సెలింగ్ – 40 అవగాహన కార్యక్రమాలుజిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో మహిళలు, బాలికల భద్రత కోసం షీ–టీమ్స్ కట్టుదిట్టంగా పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన వారిపై ఏప్రిల్ నెలలో 8 ఎఫ్‌ఐఆర్‌లు, 8 ఈ–పెట్టి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.తూప్రాన్ సబ్‌డివిజన్‌లో 16 మంది, మెదక్ సబ్‌డివిజన్‌లో 40 మంది కలిపి మొత్తం 56 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. మహిళలను గౌరవించాలని, చట్టవిరుద్ధ చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాప్‌లు, రద్దీ ప్రాంతాల్లో షీ–టీమ్స్ ఆధ్వర్యంలో 40 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నిరోధంపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఎవరైనా మహిళలను వేధించినా, అవహేళనగా మాట్లాడినా లేదా ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే డయల్ 100 లేదా షీ–టీమ్ వాట్సాప్ నంబర్ 8712657963కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.అలాగే, 18 ఏళ్లు నిండకముందే బాలికల వివాహాలు జరిగితే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కూడా పనిచేస్తోందని, మానవ అక్రమ రవాణా మరియు ఆర్గనైజ్డ్ నేరాలపై సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కుల వివక్షతకు తావివ్వద్దు –తాసిల్దార్ మాలతీ

0

ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్ 30,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

ఎస్సీ ఎస్టీ మహిళలపై దురుసుగా ప్రవర్తిస్త కఠిన చర్యలు తప్పవని తాసిల్దార్ మాలతీ అన్నారు. గురువారం మండల పరిధి రుద్రారం గ్రామంలో ఎస్సీ కాలనీలో పౌరహక్కుల దినాన్ని అవగాహన సదస్సులో ఆమెమాట్లాడుతూ,బాల్య వివాహాలను అరికట్టాలని మద్యానికి దూరంగా ఉండాలని, సైబర్ నెల పట్ల యువత ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల సంతోష నవీన్, కుమార్ ఉప సర్పంచ్, పుల్లగళ్ల నరసింహులు, కొంగర సత్తయ్య, క్యసారం బాలు, శవాల దుర్గ పతి, మహిళా సంఘాల నాయకులు అంగన్వాడి టీచర్ సలీమా, రూపా, రాణి ఆశ వర్కర్ కవిత, పాల్గొన్నారు.

బాలల సంరక్షణపై 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమర్థవంతంగా అమలు

0

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

బాలల సంరక్షణపై మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో సమర్థవంతంగా అమలవుతోంది. ఈ సందర్భంగా మెదక్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బాలల సంరక్షణ ఎగ్జిబిషన్‌ను మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, నోడల్ అధికారి వల్లేటి ప్రేమ్ చంద్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి హేమ భార్గవి పాల్గొన్నారు. ఎగ్జిబిషన్‌లో బాలల హక్కులు, ఆరోగ్యం, విద్య, భద్రత వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆయన ఆసక్తిగా వీక్షించారు.ఈ సందర్భంగా వల్లేటి ప్రేమ్ చంద్ మాట్లాడుతూ, జిల్లాలో బాలల సంరక్షణపై 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు. పిల్లలకు ఎగ్జిబిషన్‌ను ప్రతిరోజు సందర్శించేలా చర్యలు తీసుకోవాలని, బాలల న్యాయపరమైన హక్కులు, ఆరోగ్యం, విద్య, భద్రతపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.అలాగే పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం అధికారులు మరింత కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.