Wednesday, May 6, 2026
Home Blog Page 5

శ్రీకరి జ్యువెలర్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించిన కౌడిపల్లి ఏఎస్ఐ ఆండాలు

0

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 30, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ ప్రతినిధి (బుచ్చన్న)

మెదక్ జిల్లా మండల కేంద్రమైన కౌడిపల్లి లో శ్రీకరి జువెలర్స్ & పాన్ బ్రోకర్స్ ఆధ్వర్యంలో కౌడిపల్లి స్థానిక ఏఎస్ఐ ఆండాలు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. గురువారం సంత కావడంతో సంతకు వచ్చిన ప్రజలకు చల్లని నీరు మజ్జిగ అందించారు.ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ… రోజురోజుకు ఎండల ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో శ్రీకరి జ్యువెలర్స్ యజమాని నాగరాజు చారి, ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహాన్ని తీర్చడం గర్వించదగ్గ విషయం అన్నారు. కొన్ని ఏళ్ల క్రితం వేసవికాలం వచ్చిందంటే చాలు ఎందరెందరో దాతలు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహం తీర్చడానికి ముందుకొచ్చే వారన్నారు. ప్రస్తుతం హోటల్ కి వెళ్లి గ్లాసేడు నీళ్లు తాగాలన్న 20 రూపాయలు బాటిల్ కొని తాగాలంటున్న యజమానులు ఉన్నారు. త్రాగే నీటితో కూడా వ్యాపారం చేస్తూన్నారు అన్నారు. ఇలాంటి సమయంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహం తీరుస్తున్నందుకు నాగరాజు చారిని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు కొందరు దాతలు ముందుకు వచ్చి నిర్వహించడం ద్వారా ప్రజలకు మంచి చేసినవారు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎమ్మార్వో జహీర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజీవ్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు పోల నవీన్, చంద్రం వెంకట్ గౌడ్, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి కొండోజు నరసింహ చారి, గ్రామ పెద్దలు పునరీకం గౌడ్, సత్యనారాయణ గౌడ్, జగన్,మాసన్న గారి హరీష్, గుడ్డంల రాజశేఖర్, శ్రీకాంత్ గౌడ్, తోపాటు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సఖి సెంటర్‌లో బాధితులకు అత్యుత్తమ సేవలు – వల్లేటి ప్రేమ్ చంద్

0

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

సఖి సెంటర్‌లో బాధిత మహిళలకు అత్యుత్తమ సేవలు అందించాలని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, నోడల్ అధికారి వల్లేటి ప్రేమ్ చంద్ సూచించారు. మెదక్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు ఆదర్శంగా ఉందని ఆయన ప్రశంసించారు.గురువారం నర్సాపూర్ పరిధిలో నిర్వహిస్తున్న సఖి కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెంటర్‌లో నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించి, క్లిష్టమైన కేసులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత మహిళలకు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.అదేవిధంగా మహిళలు పని చేసే ప్రదేశాల్లో ఎదురయ్యే ఇబ్బందులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపై లైంగిక దాడి చట్టాలపై అవగాహన కార్యక్రమాలను మరింతగా నిర్వహించాలని సూచించారు.అనంతరం రెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన, గర్భిణులు మరియు బాలింతలకు పోషక విలువలున్న ఆహారం గురించి పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. పోషణ్ అభియాన్ కార్యక్రమం ద్వారా తల్లి–బిడ్డలకు సమగ్ర పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, సీడీపీఓలు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దివ్యభారత్ పుస్తకంలో కొండగట్టు అంజన్న స్వామికి చోటు

0

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

తెలంగాణలో అత్యంత శక్తివంతమైన ఆలయాల్లో ఒకటిగా పేరున్న కొండగట్టు అంజన్న ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. నీతి అయోగ్ రూపొందించిన దివ్యభారత్ పుస్తకంలో ఈ ఆలయానికి చోటు దక్కడం తెలంగాణ రాష్ట్రానికి, ఈ ఆలయానికి ప్రాధాన్యత సంతరించుకున్నట్లయింది. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు మన దేశంలో ఉన్న ముఖ్యమైన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, దర్శనీయ స్థలాలను పరిచయం చేస్తూ నీతి అయోగ్ సంస్థ దివ్యభారత్ పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకం లో తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కొండగట్టు అంజన్నకు స్థానం దక్కడంతో ఈ ఆలయ చరిత్ర, విశిష్టత దేశవ్యాప్తంగా నే కాకుండా దేశ విదేశాలకు సైతం పాకినట్లు అవుతుంది. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు, భక్తులు ఈ గుర్తింపు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గౌరవంతో కొండగట్టు అంజన్న క్షేత్రం దేశ పర్యాటక పటంలో ప్రాముఖ్యతను సంతరించుకోవడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.

దర్శకులు పీసీ ఆదిత్య కు ఇండోనేషియా ఎక్సెలెన్సీ అవార్డు

0

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 30, ప్రత్యేక ప్రతినిధి (మల్పర్తి రాంచందర్)

తెలుగు సినీ రంగం లో గత 30 సంవత్సరాలనుండి పలు ప్రయోగాలు చేస్తూ ఎంతో మంది నూతన కళాకారులకు అవకాశాలు ఇస్తున్న సినీ శ్రామికుడు, దర్శకుడు డా. పీసీ ఆదిత్య కు మరో అంతర్జాతీయ పురస్కారం దక్కింది. మన దేశానికి చెందిన గ్రీన్ ఇండియా పరివార్ తో కలిసి పర్యావరణ పరిరక్షణ కు కృషి చేస్తున్న ఇండోనేషియా కు చెందిన ఎన్ జి ఐ పి ఫౌండేషన్ పీసీ ఆదిత్య సేవల్ని గుర్తించి ఇండోనేషియా ఎక్సలెన్సీ అవార్డు2026ను బహుకరించినట్లు ఇండియా ప్రతినిధి నీరజ్ గుప్త తెలిపారు. సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలు రూపోందిస్తున్న పీసీ ఆదిత్య కు ఈ అవార్డు అందజేయడం గర్వం గా ఉందన్నారు… అవార్డు గ్రహీత ఆదిత్య స్పందిస్తూ మన దేశానికి మిత్ర దేశమైన ఇండోనేషియా నుండి ఈ అంతర్జాతీయ అవార్డు అందుకోవడం భారతీయుడిగా గర్వపడుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను సినీ రంగానికి చెందిన పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందించారు.

శత శాతం సత్తా చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు.

0

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 29,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

2025 – 26 విద్యాb సంవత్సరానికి వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో తెలంగాణ ఆదర్శ పాఠశాల శంకరంపేట (రా) విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించారు. పాఠశాల స్థాయితో పాటుమండల స్థాయిలో ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం సాధించడం గర్వించదగిన విషయమని తెలిపారు గుండు భవ్యశ్రీ 572/600, గుండు సాహితి 572/600 శాలిపేట, ద్వితీయ స్థానం కే, వైష్ణవి 570/600, తృతీయ స్థానం బెహరా కరిష్మా 567/600, తోపాటు99 మంది విద్యార్థులకు గాను 50 పైగా విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించడమే కాకుండా గత పది సంవత్సరాల నుంచి ఆదర్శ పాఠశాల శత శాతం ఉత్తీర్ణత సాధించడం గర్వించదగిన విషయమని పాఠశాల ప్రధానాచార్యురాలు వాణికుమారి సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా విద్యార్థులందరికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నతమైన స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఆర్థిక అవగాహన కార్యక్రమం

0

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 29,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

ప్రతి ఒక్కరికి సమాజంలో చదువు ఎంతో ఉపయోగమని ఆర్థిక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, సైబర్ నేరాలపట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడి సూపర్వైజర్ అంజమ్మ, ఏఎస్ఐ విటల్, అంగన్వాడి కార్యకర్తలు మేడి మాలతీ, వాడు సభ్యుడు కే. ప్రమీల,పాల్గొన్నారు.

విధి వక్రీకించిన… సంకల్పబలంతో ముందుకు వెళుతున్న దివ్యాంగులు

0

దివ్యాంగుల భవిత కేంద్రాన్ని పరిశీలించిన —స్పెషల్ ఆఫీసర్ వెంకటయ్య

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 29,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

చిన్నశంకరంపేట మండల కేంద్రంలో నీ ప్రాథమిక పాఠశాలలో ఉన్న దివ్యాంగుల భవిత కేంద్రాన్ని మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటయ్య బుధవారంసందర్శించారు. భవిత కేంద్రంలోని దివ్యాంగుల సంఖ్య, ఈ కేంద్రాలకు వస్తున్న తీరు, బోధనతోపాటు ఫిజియోథెరపీ వంటి కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతున్నాయనని బోధకురాలు రత్నకు అడిగి తెలుసుకున్నారు. వారికి కనీసం అవసరాలు ఉన్నాయా! ఇక్కడి వసతులు ఏమిటి? అని తెలుసుకున్నారు. వేసవికాలం దుశ్య విద్యార్థులను బయటకి తీగనీయ వద్దని తెలిపారు. దివ్యాంగులకు భరోసా కింద వారికి కావలసిన సమస్యలు పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. వీరితో పాటు ఎంపీడీవో దామోదర్, ఉన్నారు.

పక్కాగా జనగణన – సజావుగా ధాన్యం కొనుగోలు

0

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 29, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో జనగణన ప్రక్రియను పక్కాగా నిర్వహించడంతో పాటు ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని సజావుగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ సిబ్బందికి సూచించారు.బుధవారం నిజాంపేట మండల కేంద్రంలో ఆయన జనగణన తీరును డోర్ టు డోర్ తిరిగి పరిశీలించారు. ప్రతి ఇంటి నుంచి పూర్తి సమాచారం సేకరించడంతో పాటు ప్రజలందరినీ జనగణనలో భాగస్వామ్యం చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ఫ్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన నగేష్, తూకం ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ధాన్యం తూకంలో ఎలాంటి లోపాలు లేకుండా ఖచ్చితత్వం పాటించాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ దయాకర్ గౌడ్

0

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 29, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ ప్రతినిధి (బుచ్చన్న)

నర్సాపూర్ నియోజకవర్గ కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్యాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్ ను పోతంశెట్టిపల్లి గ్రామ సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్ ప్రారంభించడం జరిగింది, ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం మద్దతు ధరను పెంచుతూ వస్తుందని, కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకొని, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు సెంటర్లోనే రైతు తన ధాన్యాన్ని అమ్మాలనితెలుపడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుండు నాని, పి ఎ సి ఎస్ సీఈవో కృష్ణ, ఏ ఈ ఓ నిరోషా, వార్డు మెంబర్లు నాయికోటి మహిపాల్, గొల్ల ఏగొండ, బుట్ట శ్రీనివాస్, చిట్యాలయాదయ్య, గడ్డమీదినర్సింలు,సాయిని సిద్దిరములు, కొమ్ముల చిన్న గౌడ్,పాతూరి రామకృష్ణ గౌడ్,చాకలి నాగరాజు,నర్సింలు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

కిష్టాపూర్ లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.

0

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 29, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ ప్రతినిధి (బుచ్చన్న)

కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథులుగా హాజరైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్ గ్రామ సర్పంచ్ స్వప్న ఊశయ్య

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ. రైతులు ఈ ప్రభుత్వ ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను సకాలంలో సద్విని చేసుకొని వరి ధాన్యాన్ని విక్రయించవలసిందిగా కోరుతూ. దళారులను నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వమేదైతే చిత్తశుద్ధితో ఉంది రైతుల పట్ల వరి ధాన్యం చివరి గింజ వరకు కొనే ఏర్పాట్లు మన రైతు బాంధవుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముందస్తు వర్షాల కారణంగా రైతులు మీ కల్లాల వద్ద అప్రమత్తంగా ఉండి టార్పణెండ్లు అందుబాటులో ఉంచుకొని వర్షాల నుండి వరి ధాన్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉన్నది రైతులు క్యూ పద్ధతిలో కొనుగోలు కేంద్ర సిబ్బందికి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఈఓ నవీన్ గ్రామ సర్పంచ్ సప్న ఉషయ్య కిష్టాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు పెద్ది శ్రీశైలం వార్డు సభ్యులు వెంబడి మల్లేశం మల్కా ప్రవీణ్ శేఖర్ రైతులు శేఖర్ గావ్కాని పోచయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్యామ్ భాస్కర్ నవీన్ సిబ్బంది యాదగిరి రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.