Wednesday, May 6, 2026
Home Blog Page 3

అంబేద్కర్ అవార్డు గ్రహీత రామచంద్రంకు సన్మానం

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 4, చిన్న శంకరంపేట (కమ్మరి దేవరాజు)

అంబేద్కర్ జాతీయ అవార్డుకు ఎంపికైన చిన్న శంకరంపేట మండలంలోని కొలుపల్లికి చెందిన తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామ్ చరణ్ కు సర్పంచ్ల పోదాం జిల్లా అధ్యక్షుడు ఆవుల గోపాల్ రెడ్డి సత్కరించారు. మండల కేంద్రంలో సర్పంచుల పొలం మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ తో కలిసి ఆయన సేవలను కొనియాడారు. జూన్ 15 అవార్డు అందు కుంటున్న 0దుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కర్నే సాయిలు ఉదయ్ కుమార్ ఉన్నారు.

చెరువుల కబ్జాను కాపాడేందుకు డిజిటల్ సర్వే

0

-మొదటి దశగా 606 గుర్తింపు

గూగుల్ మ్యాప్ నక్ష తో చెరువు హద్దులు గుర్తింపు–నీటిపారుదల ఈఈ శ్రీనివాసరావు

ఏ2డిజిటల్ న్యూస్, మే 4,చిన్నశంకరంపేట:(కమ్మరి దేవరాజు)

చిన్న నీటి వనరులు కాపాడేందుకు మండల స్థాయిలో ఏర్పాటు చేసిన డిజిటల్ కమిటీల ద్వారా సర్వే చేసి ఎఫ్టీఏల్ హద్దులను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నశంకరంపేట మండలంలో 173 చెరువు కుంటలు ఉన్నాయి. మొదటి దశగా 30 చెరువులకు ఎప్టీఎల్ సర్వే చేముటకు అనుమతి లభించింది. చెరువుల సంరక్షణకు అది కాదు సిద్ధమయ్యారు. నీటిమట్టం గుర్తించి హద్దులు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. డిజిటల్ సర్వే నిర్వహించేందుకు ఇప్పటికే మండలంలో చెరువుల లో వెళ్లి సర్వే నిర్వహించెందుకు ప్రణాళిక రూపొందించారు. ఎఫ్ టి ఎల్ కబ్జాలకు తెలపడింది. ఏమైంది చేగుంటతో పాటు పట్టణాలలో అక్రమంగా చెరువులు కబ్జా చేసి భవన నిర్మాణాలు చేపడుతున్న సంఘటనలు ఉన్నాయి ముందుగా మట్టి నింపి తరువాత నిర్మాణాలు చేపట్టిన సంఘటనలు వెల్లులిలోకి వస్తున్నాయి ఈ క్రమంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం డిజిటల్ సర్వే నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. *చెరువుల్లో పక్కాగా హద్దులు*మొదటి దశగా గుర్తించిన 66 చెరువులకు డిజిటల్ సర్వే నిర్వహించేందుకు అధికారులతో కూడిన కమిటీలను నియమించారు ఇందులో తాసిల్దార్ రెవెన్యూ సర్వే యార్ ఇరిగేషన్ ఏఈ అడవి శాఖ అధికారులతో కూడిన కమిటీ చెరువులను పరిశీలిస్తుంది. ముందుగా తాసిల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న చెరువు నక్షత్ర పాటు గూగుల్ మ్యాప్ ఆధారంగా డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఎఫ్.టి.ఎల్ కు గురించి హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే శాశ్వతంగా చెరిగి పోకుండా హద్దులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.*కబ్జాలు అరి కట్టేందుకే ఏప్టీఎల్ గుర్తింపు సర్వే*మెదక్ జిల్లాలో చిన్న నీటి వనరులు కాపాడేందుకు చర్యలు చేపడుతున్నామని ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాసరావు తెలిపారు. ముందస్తుగా ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా సర్వే చేసి ఎఫ్ టి ఎల్ హద్దులు ఏర్పాటు చేస్తున్నాం దీని ద్వారా చెరువులు కబ్జాలకు గురికాకుండా అరికట్టుతున్నాము. వర్షాకాలంలో చదువులకు నీరు చేరే లోపు మొదటి దశలో 606 చెరువులు ఎఫ్టిఎల్ గురించి గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో మండలంలోని చెరువులలో ఇప్పటికే సర్వే చేస్తున్నామని తెలిపారు.

పైతర లో కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో -మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 3, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

మెదక్ జిల్లాకొల్చారం మండలం పైతర గ్రామంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణం మరియు నూతన కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో అతిధులుగా పాల్గొన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రేస్ పార్టీ కార్యదర్శి పుల్లబోయిన దుర్గేష్ ముదిరాజ్. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి డివిజన్ బ్లాక్ కాంగ్రేస్ మాజీ అధ్యక్షుడు యెల్లుగారి శ్రీనివాస్ రెడ్డి, కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పైతర గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ వారోత్సవాలు విజయవంతం

0

– డివిజన్ స్థాయి ప్రజావాణి ప్రారంభం

జనగణనకు కట్టుదిట్ట చర్యలు

జిల్లాలో వ్యవసాయ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి రేపటి నుండి డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. అదే సమయంలో జనగణనను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్డీవోలతో గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో జనగణనను పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రేపటి నుండి ప్రారంభమయ్యే వ్యవసాయ వారోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం వ్యవసాయ అధికారులు సమగ్ర కార్యాచరణతో కార్యక్రమాలను అమలు చేయాలని ఆదేశించారు.ప్రజల సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ప్రజావాణి” కార్యక్రమాన్ని ఇకపై రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణితో పాటు, డివిజన్ స్థాయిలో ఆర్‌డీవో కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.జిల్లా మరియు డివిజన్ స్థాయి అధికారులు తప్పనిసరిగా ప్రజావాణికి హాజరై ప్రజల వినతులను స్వీకరించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసి, ప్రతి వినతికి ప్రత్యేక ధృవీకరణ సంఖ్య కేటాయిస్తారని తెలిపారు.అందిన ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరించి, తీసుకున్న చర్యల నివేదికలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.జిల్లా కలెక్టరేట్‌తో పాటు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ప్రత్యేక ప్రజావాణి విభాగాలను ఏర్పాటు చేయాలని, అధికారులు ప్రజల పట్ల నిబద్ధతతో వ్యవహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

షార్ట్ సర్క్యూట్ తో పురిగుడిసె దగ్ధం

0

-ఐదు లక్షల నష్టం

ఏ2డిజిటల్ న్యూస్, మే 3,చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

ప్రమాదవశాస్తు షార్ట్ సర్క్యులేట్ తో పురి గుడిసె సోమవారం పూర్తి దగ్ధమైన సంఘటన మండలంలోనిమల్లుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటింబుకుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఇదే గ్రామానికి చెందిన అరికెల నాగమణి- రమేష్ నివాస పురిగుడిసె షార్ట్ సర్క్యూట్ పూర్తిగా దగ్ధం అయింది. రెండు క్వింటాళ్లబియ్యం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బట్టలు, తులంనర బంగారం,వెండి, లక్ష రూపాయల నగదు కాలిపోయాయి నిరాశలయ్యారు. ప్రభుత్వం బాధితులను ఆదుకొని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ ఇమ్మడి నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెవెన్యూ కార్యాలయంలో బాధితురాలు ఫిర్యాదు చేశారు.

ఇందిరమ్మ ఇళ్లతో పేదోని కళ నెరవేర్చింది

0

–అట్టహాసంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం

ఏ2డిజిటల్ న్యూస్, మే 3, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

అట్టహాసంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాలు జరిగాయి. మండల పరిధి జంగరాయి గ్రామంలో నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్ల కింద ఇండ్లు మంజూరు కాగా ఇల్లు కట్టుకొని ఆదివారం గ్రామ సర్పంచ్ జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆవుల గోపాల్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.బిఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలలో ఒక ఇల్లు కూడా నిర్మించలేదని, తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అందుకే నిరుపేదలకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఇండ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో మండలంలోని గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు మరిన్ని మంజూరికి కృషి చేస్తామని తెలిపారు.రెండో విడత ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ ప్రక్రియలు జరగనున్నాయని తెలిపారు.

ప్రశాంత వాతావరణంలో నీట్ పరీక్షలు

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 3, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా ముగిశాయి.జిల్లాలో మొత్తం 479 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 465 మంది హాజరై పరీక్ష రాశారు. 15 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీవో రమాదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, బయోమెట్రిక్ వ్యవస్థను పరిశీలించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.పరీక్షలకు హాజరైన విద్యార్థుల వివరాలు, గైర్హాజరు శాతం తదితర అంశాలను వారు సమీక్షించారు. పరీక్షలు పూర్తయ్యేంతవరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇన్విజిలేటర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఇతరులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని స్పష్టం చేశారు.పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగాయని పేర్కొన్నారు.మెదక్ ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, పరీక్షా కేంద్ర నిర్వాహకులు, పోలీసు అధికారులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కనుమరుగు కానున్న ఊర పిచ్చుకలు…!

0

ఏ2డిజిటల్ న్యూస్, మే3, నర్సాపూర్ ప్రతినిధి (రాoచందర్)

ఇల్లంతా సందడిగా తిరుగుతూ వేసే గింజలను తింటూ కనువిందు చేసే ఊర పిచ్చుకలు కనుమరుగు కానున్నాయా అంటే తాజా గణాంకాలు అవుననే అంటున్నాయి. సెల్ టవర్, కాంక్రీట్ జంగల్ వీటికి శాపంగా మారి గత ఐదేళ్లలో 97 శాతానికి నశించిపోయినట్లు ఓ సర్వే తేల్చి చెప్పడం దారుణం. ఇంట్లో మనుషులతో సమానంగా తిరుగుతూ గోల చేసే ఈ చిన్న ప్రాణి ఇక జ్ఞాపకంగా మారనుంది అంటే పకృతి ప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవి సమూహాలుగా జీవిస్తూ ధాన్యం గింజలు చిన్నచిన్న పురుగులను ఆహారంగా తింటూ ఇంటి వాసాలు, పగులు వచ్చిన గోడలు, పాత ఇండ్లలో గూడు కట్టుకుంటూ జీవం సాగిస్తుంటాయి. వీటికి ముఖ్యంగా సెల్ టవర్ నుంచి వచ్చి రేడియేషన్ కు ఇవి విలవిలలాడి అంతరించిపోతున్నాయి. మనిషి అభివృద్ధి, టెక్నాలజీ పేరిట వీటికి మరణశాసనం రాస్తుండనే చెప్పాలి. ఏ పక్షులకు లేని సాన్నీహిత్యం ఊర పిచ్చుకలతో ఉంది దీనికి సంబంధించిన ఓ చిన్న కథ కూడా పెద్దలు చెప్పేవారు. మనిషికి మూడు పూటలా అన్నం పెట్టమని ఈ ఊర పిచ్చుక బ్రహ్మ దేవుని కోరిందట దానికి ఫలితంగా నీవేమిస్తావని బ్రహ్మదేవుడు అడగగా నా నడకను త్యాగం చేస్తానని చెప్పిందట అందుకే ఊర పిచ్చుకలు మామూలు మిగతా పక్షులాగా నడవవు. దూకినట్లు నడవడం లేదంటే ఎగరడం ఆ కథలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ పక్షులు ఇంట్లోకి వస్తే మంచిదని నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పూర్వకాలంలో వడ్ల గింజలు, చిరుధాన్యాల గింజలతో ఉన్న కంకులను వీటి కోసం గుమ్మానికి మరీ కట్టేవారు. అవి స్వేచ్ఛగా ఇంట్లోకి వచ్చి వాటిని తింటూ ఇల్లంతా తిరిగినా వాటికి ధాన్యపు గింజలు పెట్టడం తమ బాధ్యతగా భావించేవారు. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసరికి వీటికి నిలవ నీడ లేకుండా పోయింది. ఇవి మిగతా పక్షుల లాగా అడవుల్లో బతికేంత స్థాయి కాదు. రైతులను ఆధారం చేసుకుని వీటి ప్రాధాన్యత గుర్తించిన వాళ్ళ ఇండ్లనే ఆవాసంగా చేసుకుంటూ బతికే జీవి. ఇప్పుడు ప్రస్తుతం సెల్ ఫోన్ టవర్ల కారణంగా చెట్ల నరికివేత కారణంగా మనుషులకు వీటికి ఉన్న బంధం దూరమై గడచిన ఐదేళ్లలో వీటి సంఖ్య సెల్ టవర్ల కారణంగా తొంబై ఏడు శాతానికి పడిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా ఇవి ఉన్న కొన్ని ప్రదేశాల్లోనైనా బతికేందుకు వీలుగా కృత్రిమ గూళ్లను, ధాన్యపు గింజలు అవి ఉండేందుకు అనువైన వాతావరణం సృష్టిస్తే వీటిని బతికించుకున్న వాళ్ళం అవుతాం. లేదంటే అంతరించిపోయే జీవుల జాబితాలో ఇవి చేరడం పక్క. ఇలాంటి రోజులు రాకుండా మళ్ళీ వీటికి పూర్వవైభవం రావాలని మనమూ కోరుకుందాం.

ఆత్మ నిర్భయ పంచాయతీ శిక్షణ శిబిరం –పంచాయతీ ప్రిన్సిపాల్ సెక్రటరీ మీనా కుమారి

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 3,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భయ పంచాయితీ శిక్షణ శిబిరంలో సెక్రెటరీ మీనా కుమారి పాల్గొని మాట్లాడుతూ సాధారణ నిధులతో గ్రామాలు తీర్చిదిద్దాలని పంచాయతీ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రెటరీ మీనకుమారి సర్పంచ్లకు సూచించారు. హైదరాబాదులోని రాజేందర్ నగర్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భయ పంచాయతీ శిక్షణ చిన్న శంకరంపేట సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్ చందంపేట సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు లాస్య స్థాయిలో 60 మంది సర్పంచులకు నిర్భయ పంచాయతీ కార్యక్రమంలో అవకాశం కల్పించినట్లు అందులో నుండి మెదక్ జిల్లా సంబంధించి ఏడు గ్రామపంచాయతీ సర్పంచ్లకు మాత్రమే ఆహ్వానందిందని తెలిపారు సాధన నిధులతో గ్రామాల అభివృద్ధి లో మరిన్ని డబ్బులు వచ్చే విధంగా వ్యాపారాలు తయారు చేసుకొని అభివృద్ధిని ముందంజలో నడపాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ప్రదీప్ పద్మ తదితరులు పాల్గొన్నారు.

వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభం

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 2,చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సర్పంచ్ దివ్య లింగం గౌడ్ ప్రారంభించారు. ఫిజికల్ డైరెక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మడూర్ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 21వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు ఈ శిక్షణ రోజు ఉదయం సాయంత్రం జరుపబడుతుందని తెలిపారు. అనంతరం సర్పంచ్ దివ్య లింగం గౌడ్ మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. వేసవి రోజుల్లో ఉదయం సాయంత్రం రెండు పూటలా క్రికెట్ వాలీబాల్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు క్రీడాకారులు సకాలంలో వచ్చి క్రీడలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ కె కిరణ్ కుమార్, సర్పంచ్ దివ్య లింగ గౌడ్ ఉపసర్పంచ్ యువకులు పాల్గొన్నారు.