Sunday, July 5, 2026
Home Blog Page 3

త్వరితగతిన భూ సేకరణ పూర్తి చేయాలి– జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2డిజిటల్ న్యూస్, మే30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.శనివారం మెదక్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) జోనల్ మేనేజర్ మధు, డిప్యూటీ జోనల్ మేనేజర్ శ్రావతి, మేనేజర్ శ్రీవాణి, జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) అసిస్టెంట్ డైరెక్టర్ సంగీత తదితర అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మెదక్ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు కోసం పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ (Land Acquisition) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. భూ సేకరణ ప్రక్రియలో ఉన్న అడ్డంకులను తొలగించి, పనులు వేగంగా పూర్తయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులకు (RDOలు) మరియు టీజీఐఐసీ (TGIIC) జోనల్ మేనేజర్‌కు ఆదేశాలు జారీ చేశారు.జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి భూ సేకరణ కీలకమని పేర్కొన్న కలెక్టర్, సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

టిపిసిసి ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ బి ఎల్ ఏ ఎస్ ఎస్ ఏ ల సమీక్ష సమావేశం

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 30,సీనియర్ జర్నలిస్ట్ (బుచ్చన్న)

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టి పి సి సి ఆధ్వర్యంలో గాంధీభవన్ లో ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ అధ్యక్షతన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి బి ఎల్ ఏ, ఎస్ ఎస్ ఏ ల సమీక్షా సమావేశం నిర్వహించినారు.ఈ సమావేశంలో మెదక్ మల్కాజిగిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, టి జి ఐ ఐ సి చైర్మన్ నిర్మలజగ్గారెడ్డి,మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు,మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, ఎస్ ఎస్ ఏ కోఆర్డినేటర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సెక్యులర్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓట్ల తొలగింపు ప్రక్రియజరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయి నుంచి పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఓటర్ల జాబితాలో అక్రమాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. బూత్ స్థాయి నుండి పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమకార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లేలా కార్యాచరణలను రూపొందించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి ఐటీసీ మైరా సంస్థ చేయూత..!

0

ఏ2డిజిటల్ న్యూస్, మే30, మనోహరాబాద్ ప్రతినిధి (రామకృష్ణ)

గ్రామ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. మెదక్ జిల్లా, మనోహరాబాద్ మండలం, కొండాపూర్ గ్రామంలోని ఊరు చెరువు కట్ట బలోపేతానికి ఐటీసీ మైరా సంస్థ ముందుకు వచ్చింది. ఈ పనులకు గ్రామ సర్పంచ్ నూకల రాము అధ్యక్షతన శుభారంభం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాధవి వెంకటేష్, గ్రామ కార్యదర్శి సంతోష్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చెరువు కట్ట బలోపేతం కావడం ద్వారా చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, రైతులకు సాగునీరు సకాలంలో అందుతుందని హర్షం వ్యక్తం చేశారు.అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమం గ్రామ వ్యవసాయానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. గ్రామ ప్రజల సంక్షేమం కోసం ముందుకు వచ్చిన ఐటీసీ మైరా సంస్థకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.”చెరువు బలోపేతం – రైతుకు భరోసా, గ్రామాభివృద్ధికి నాంది” అంటూ గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం గ్రామంలో అభివృద్ధికి కొత్త ఊపును తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తమైంది.

మహిళా సాధికారతకు వేదికగా ఇందిరా మహిళా శక్తి భవనం

0

రూ.5 కోట్లతో నిర్మాణం తుది దశకు – నాణ్యతపై రాజీ లేదు : కలెక్టర్ ప్రతిమా సింగ్

ఏ2 డిజిటల్ న్యూస్, మే 29, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ మహిళా సాధికారతకు వేదికగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ ప్రాంతంలో, ధ్యాన్‌చంద్ చౌరస్తా సమీపంలో నిర్మాణం తుది దశకు చేరుకున్న ఇందిరా మహిళా శక్తి భవన సముదాయ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఈఈ నరసింహులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనం పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఇంకా మిగిలిన పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.మహిళల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు మార్కెటింగ్ కార్యక్రమాలకు ఈ భవనం ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. మహిళా సాధికారతకు ఈ భవనం ఒక వేదికగా నిలవాలని ఆకాంక్షించారు.భవన నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్మాణ ప్లాన్లు, గదుల ఏర్పాటు, మౌలిక వసతుల పనులను పరిశీలించిన ఆమె, పనుల పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.ఈ పరిశీలనలో పంచాయతీరాజ్ ఈఈ నరసింహులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్సీ హాస్టల్ లో పాములు కలకలం

0

— పలుమార్లు చెప్పిన పట్టించుకొని హాస్టల్ వార్డెన్ శివరామ్

—హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చెయ్యాలి

… ఎస్ ఎఫ్ ఐ మెదక్ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్

ఏ2డిజిటల్ న్యూస్, మే 27,సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న )

జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో పాములు కలకలం రేపుతున్నాయి. ఈ విషయాన్ని పలుమార్లు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్న SC హాస్టల్ లో పాములు కలకలం రేపుతున్నాయి.పలుమార్లు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదు. అలాగే డిగ్రీ విద్యార్థులు విద్యార్థులు పరీక్షలు ఉండటం వలన హాస్టలో ఉంటూ చదువుకున్నారు అయిన ఉదయం స్నానం చెయ్యడానికి వెళ్లిన మూత్రవిసర్జన చెయ్యడానికి వెళ్తే బాత్రూంలలో పాములు వస్తున్నాయి.అలాగే హాస్టల్ ఆవరణలో లోకి వస్తున్నాయి అని పలుమార్లు చెప్పిన పట్టించుకోడంలేదు. అలాగే మూత్రశాలలు సరిగా పరిశుభ్రత లేదు.చెప్పిన కూడా పట్టించుకోవడం లేదు వార్డెన్ శివరామ్ను తక్షణమే సస్పెండ్ చెయ్యాలి.ఈ కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులు గణేష్, చింటూ, విష్ణు, దుర్గేశ్ తదితరులు పాల్గొన్నారు.

పోతంశెట్టిపల్లి గ్రామపంచాయతీని సందర్శించిన:డిపిఓ యాదయ్య

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 27,సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న )

బుధవారం జిల్లా పంచాయతీ రాజ్ అధికారి యాదయ్య పోతంశెట్టిపల్లి గ్రామపంచాయతీని సందర్శించి రిజిస్టర్ లను తనిఖీ చేసి వివిధ అభివృద్ధి పనులను పర్యవేక్షణ చేసి సంతోషం వ్యక్తం చేశారు, అదేవిధంగా గ్రామపంచాయతీకి తగు సూచనలు సలహాలను అందజేశారు, ఈ కార్యక్రమంలో ఎం పి ఓ సయ్యద్ మగ్దూం, గ్రామ సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్, సెక్రటరీ అరుంధతి, వార్డు మెంబర్లు చాకలి అశోక్, జలగం సంతోష్, బుట్ట శ్రీనివాస్, సగినాల దీవెన, సగినాల యశోద, సాయినీ యాదగిరి, నాకోటి జగన్నాథం, పట్నం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

రైతులతో కలిసి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన సర్పంచ్: దొడ్లే ఆంజనేయులు

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 27,సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

బుధవారం తుక్కాపూర్ గ్రామంలో సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు రైతులతో కలిసి కల్లాలను పరిశీలించారు రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వ మొండి వైఖరితో వడ్ల కొనుగోలు విషయంలో అవగాహన లేకపోవడం అద్దం పట్టినట్టు కనిపిస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవీందర్ బిఆర్ఎస్ నాయకులు దత్తు రావు అరే శివాజీ అజయ్ కృష్ణ శేఖర్ చంద్రయ్య భాగయ్య మల్లేశం దేవయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు.

చేనేత కార్మిక పెన్షన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

0

ఏ2డిజిటల్ న్యూస్ మెదక్ మే 27:సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

మెదక్ జిల్లా వ్యాప్తంగా వృద్ధాప్య, వికలాంగ, వితంతు,చేనేత, బీడీ కార్మిక, తదితర పెన్షన్ల మంజూరుకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు చేనేత కార్మిక పెన్షన్లుపొందడానికి (అర్హతలు1) కనీసం 50 సంవత్సరాలు అంతకంటే పైగా వయసు కలిగి ఉండాలి 2) ఆధార్ కార్డు జిరాక్స్ 3) ఓటరు ఐడి కార్డు జిరాక్స్4) రేషన్ కార్డు జిరాక్స్ 5) సంబంధిత చేనేత సహకార సంఘం కార్మిక గుర్తింపు కార్డు జిరాక్స్ 6) మీ సేవ నుండి పొందిన ఆదాయ ధ్రువీకరణ పత్రము ఒరిజినల్ 7) బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ ఆయా పత్రాలను గ్రామపంచాయతీ కార్యదర్శులకు లేదా మీ సేవలో అప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఆయా చేనేత కార్మిక సంఘాల వద్ద నోటీస్ బోర్డ్ పై వివరాల సూచికను అతికించాలని ప్రభుత్వం వెల్లడించింది. త్వరలోనే పెన్షన్ల మంజూరు ప్రక్రియ వేగవంతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. పై హరహతలు కలిగి ఉన్న వారుపూర్తి వివరాలకు ఆయా చేనేత సహకార సంఘాల చైర్మన్ లను సంప్రదించగలరు.

అప్పాజీపల్లి ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

0

కార్యవర్గానికి ఘనంగా సన్మానం

ఏ2డిజిటల్ న్యూస్, మే26, సీనియర్ జర్నలిస్ట్ (బుచ్చన్న)

కొల్చారం మండలంలోని అప్పాజీపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామంలోని ముదిరాజ్ సంఘ సభ్యులు, పెద్దలు, యువత, ప్రముఖుల సమక్షంలో జరిగిన సమావేశంలో సంఘ భవిష్యత్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సామాజిక ఐక్యత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం ఏకగ్రీవ నిర్ణయంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.ఈ ఎన్నికల్లో సంఘ అధ్యక్షులుగా చింతల భాగయ్య ముదిరాజ్, ఉపాధ్యక్షులుగా కన్నెబోయిన నర్సింహులు ముదిరాజ్, క్యాషియర్‌గా కన్నెబోయిన వేణు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా చింతల చంద్రశేఖర్ ముదిరాజ్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన నాయకులకు సంఘ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సంఘ అధ్యక్షుడు చింతల భాగయ్య ముదిరాజ్ మాట్లాడుతూ, సంఘ సభ్యులందరి సహకారంతో ముదిరాజ్ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలో సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, యువతకు ప్రోత్సాహం, విద్యా మరియు సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.ఉపాధ్యక్షుడు కన్నెబోయిన నర్సింహులు ముదిరాజ్ మాట్లాడుతూ సంఘ సభ్యులందరూ ఐక్యంగా ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి చింతల చంద్రశేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ సంఘ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, సభ్యుల మధ్య సమన్వయంపెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు.క్యాషియర్‌గా ఎన్నికైన కన్నెబోయిన వేణు ముదిరాజ్ మాట్లాడుతూ సంఘ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటిస్తూ సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తామని తెలిపారు.అలాగే గ్రామ పెద్దలు మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం గ్రామంలో ఐక్యతకు ప్రతీకగా నిలవాలని, సంఘం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు, యువతకు ఉపాధి మరియు విద్యా అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నికతో అప్పాజీపల్లి ముదిరాజ్ సంఘంలో కొత్త ఉత్సాహం నెలకొన్నట్లు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

వేగంగా ధాన్యం అన్లోడింగ్ చేయాలి— జిల్లా అదనపు కలెక్టర్ నగేష్

0

ఏ2 డిజిటల్ న్యూస్, మే26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ధాన్యాన్ని వేగంగా అన్లోడింగ్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మిల్లర్లకు సూచించారు. మంగళవారం తూప్రాన్ మండలంలోని నవదుర్గ రైస్ మిల్‌ను ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా హమాలీలు, లారీలను అందుబాటులో ఉంచుకోవాలని మిల్లర్లకు సూచించారు. అన్లోడింగ్ పనులను మరింత పకడ్బందీగా నిర్వహించాలని, హమాలీలను షిఫ్ట్‌ల వారీగా పని చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం తూప్రాన్ గ్రామ శివారులో వరి ధాన్యం కొనుగోలు, నిల్వ కోసం ఏర్పాటు చేసిన ప్రైవేట్ గిడ్డంగిని పరిశీలించారు. తూప్రాన్, వర్గల్, శివంపేట మండలాల నుంచి సేకరించిన వరి ధాన్యాన్ని ఈ గిడ్డంగిలో నిల్వ చేయనున్నట్లు తెలిపారు. గిడ్డంగిలోని నిల్వ సామర్థ్యం, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జయా చంద్రారెడ్డి, డీఎం సివిల్ సప్లై అధికారులు, మండల తహసీల్దార్లు పాల్గొన్నారు.