Wednesday, May 6, 2026
Home Blog Page 6

గ్రామ ప్రజలకు మంచినీటి సమస్య తీరింది. సర్పంచ్ నేనావత్ రవళిక రమేష్ రాథోడ్

0

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 29, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ ప్రతినిధి (బుచ్చన్న)

నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలంలోని పీర్యా తాండాలో త్రాగునీటి సమస్య తీవ్రంగానెలకొందని పీరియా తాండ సర్పంచ్ ప్రవళిక రమేష్ రాథోడ్ ఇటీవలజరిగిన సమ్మర్ యాక్షన్ ప్లానింగ్ సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాస్ ఎంపీ ఓ రామారావు మిషన్ భగీరథ ఏయి అరవింద్ లకు నూతన బోరు వేయుటకు మోటారుమంజూరుకు వివరించడం జరిగిందని ఈ సందర్భంగా స్పందించిన అధికారులు బోరు మంజూరు చేయడం జరిగిందని సర్పంచ్ ప్రవళిక రమేష్ రాథోడ్ తెలిపారు. ఈ బోరు వేయగాపుష్కలంగా నీళ్లు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. తాండ ప్రజలకు తాగునీటి సమస్య తీరిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సీఈవో ఆంజనేయులు.

0

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 29, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ ప్రతినిధి (బుచ్చన్న)

నర్సాపూర్ నియోజకవర్గ కొల్చారం మండలంలోని హంసాన్పల్లి గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ చైర్మన్ మన్నెరాములు,మాజీ సర్పంచ్ ఇంద్రసేనారెడ్డి లతో కలిసి సహకార సంఘం సీఈవో ఆంజనేయులు లాంచనంగా ధాన్యం తూకం వేసే కాంటాకు కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సీఈఓ ఆంజనేయులు మాట్లాడుతూ..ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో పి ఐ సి శ్రీలత, నర్సా గౌడ్ ,వెంకట్ గౌడ్, రమేష్ ,రాములు రైతులు పాల్గొన్నారు.

జిల్లాలో సరిపడ పెట్రోల్, డీజిల్ నిల్వలు: ఆర్డీవో రమాదేవి

0

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 28, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరిపడా నిల్వలు ఉన్నాయని ఆర్డీవో రమాదేవి స్పష్టం చేశారు. ఇంధన కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె సూచించారు.మంగళవారం మెదక్ పట్టణంలోని శ్రీనివాస పెట్రోల్ పంపును తహసిల్దార్ లక్ష్మణ్ బాబుతో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 12,000 లీటర్ల ఆయిల్ ట్యాంకర్ (8,000 లీటర్లు పెట్రోల్, 4,000 లీటర్లు డీజిల్) పంపుకు చేరింది.ప్రస్తుతం పెట్రోల్ నిల్వలు 29,232 లీటర్లు, డీజిల్ నిల్వలు 26,667 లీటర్లు ఉన్నాయని ఆమె తెలిపారు. జిల్లాలో ఇంధన లభ్యత సమృద్ధిగా ఉన్నందున వినియోగదారులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని కోరారు.అనంతరం మెదక్ మండలం రాజ్‌పల్లి గ్రామంలోని PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీవో రమాదేవి పరిశీలించారు. గన్ని సంచుల లభ్యత, తాగునీటి సౌకర్యాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 1,200 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు సిబ్బంది వివరించారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఈ సందర్భంగా సిబ్బందికి ఆమె సూచించారు.

రాష్ట్రస్థాయి విద్యా సదస్సును విజయవంతం చేయాలి–టి పి టి ఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకట్ స్వామి రమేష్ చారి పిలుపు.

0

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 28,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

ఈ నెల 30న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే టి పి టి ఎఫ్ రాష్ట్రస్థాయి విద్యా సదస్సును విజయవంతం చేయాలని ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని టిపిటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటస్వామి, రమేష్ చారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ విద్య సదస్సులో విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, దేశ- రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, సామాజిక స్థితిగతులు వంటి అంశములపై చర్చలు జరుగుతాయని తెలిపారు . ఈ రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో ప్రముఖ వక్తులుగా ప్రొ. హరి గోపాల్ గారు, ప్రొ. కోదండరాం గారు, చింతకింది కాసిం గారు, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ శ్రీనివాస్ గారు తదితర వక్తలు పాల్గొంటారని తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తూప్రాన్ మండల రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ రెడ్డి గారు గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టి పి టి ఎఫ్ ఒక సామాజిక స్పృహ కలిగిన సంఘమని కొనియాడారు. మరియు ఇలాంటి విద్యా సదస్సులు ఉపాధ్యాయులకు నేటి పరిస్థితులపై అవగాహన పెంచడంతోపాటుగా సమాజంపై పూర్తి చైతన్యం కలిగిస్తాయని తెలియజేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ టి పి టి ఎఫ్ అధ్యక్షులు ముత్యాలు గౌడ్, మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని, ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన విద్యారంగ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ వి పద్మ, జిల్లా కౌన్సిలర్లు పరమేశ్వర చారి, కిష్టయ్య, మండల కార్యదర్శి శ్రీనివాస్, ప్రవీణ్, రవీందర్ ,వసుధ, ఉమాదేవి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

చిన్న శంకరంపేటలో బాలల రక్షణ పై మానవహారం ర్యాలీ

0

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 28,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాలల రక్షణ బాల్య వివాహాల నిర్వహణ మాలగదవ్యాల నిర్మూలన పై మంగళవారం మండల సముదాయం ముందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపిల్లలతో మానవహారం ఏర్పాటు చేసి సమాజంలో వాలి వివాహాలను అరికట్టాలని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దామోదర్ అంగన్వాడి సూపర్వైజర్ అంజమ్మ అంగన్వాడి టీచర్లు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్

0

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 28, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ ప్రతినిధి (బుచ్చన్న)

నర్సాపూర్ నియోజకవర్గ కొల్చారం మండలంలోని అప్పాజీపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన గ్రామ సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ (గజిని) ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..దళారులను నమ్మి రైతులు మోసపోరాదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని రైతులు వారి ధాన్యం విక్రయించాలని ప్రభుత్వం రైతుకు సరైనగిట్టుబాటు ధర చెల్లిస్తుందని తెలిపారు. అలాగే ప్రభుత్వం రైతు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్చలం నర్సింలు వార్డు సభ్యులు సదాల నర్సింహులు, మానేపల్లి సావిత్రి ,కదూరి సుశీల, రామానుజం, పంచాయతీ కార్యదర్శి ఫణింద్ర, సీఈఓ కృష్ణ, పార్టీ గారి కృష్ణ ,కదూరి కుమార్ తిమ్మక్క పల్లి ప్రభాకర్, తిమ్మక్కపల్లి సుధాకర్ శంకర్ గౌడ్ ,శ్రీకాంత్ గౌడ్, సురేష్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

సెల్ఫ్ ఎన్యూమరేషన్‌లో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నమోదు

0

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 28, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుండి ప్రారంభమైన జనగణన డిజిటల్ నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్వయంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానంలో తన వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకున్నారు. ఈ ప్రక్రియను కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు స్వయంగా ఆన్‌లైన్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుందని, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.మే 11వ తేదీ నుండి ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు. ముందుగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసిన వారు నమోదు సమయంలో పొందిన ఐడి నంబర్‌ను ఎన్యూమరేటర్లకు తెలియజేయాలని కోరారు. అలాగే, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన ప్రతి ఒక్కరూ తమ ఐడి నంబర్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు.జిల్లా ప్రజలందరూ బాధ్యతతో పాల్గొని జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలురంగంపేటలో అన్నదాతలకు అవగాహన

0

ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్28, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ ప్రతినిధి (బుచ్చన్న)

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వావిద్యాలం ఆధ్వర్యంలో జరుగుతున్న “రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమలో భాగంగా వ్యవసాయ ఇంజినిరింగ్ కళాశాల కంది మండలం సంగారెడ్డి బోధన సిబంది డి ఆర్ లక్ష్మణ్ రావు , డి ఆర్. నీమ కూల్చారం మండలంలోని రంగంపేట్ గ్రామంలో అన్నదాతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డి ఆర్ .లక్ష్మణరావు మాట్లాడుతు, పంటలలో యూరియా వినియోగం తగ్గించడం, రసాయన ఎరువుల వినియోగం తగ్గించి జీవ ఎరువులు వాడడం మరియు సేంద్రియ పద్ధత్తులపై వివరించడం జరిగింది. డి ఆర్ నీమా మాట్లాడుతూ పంట మార్పిడి వల్ల జరిగే మేలు, నీటి ఆదా చేయడం మరియు మార్కెట్లో గిరాకీ ఉన్న వరి పంటలపై చర్చించడం జరిగింది.అలాగే ఈ కార్యక్రమంలో సమతుల్య ఎరువుల వినియోగం పై కెవికె తునికి సైంటిస్ట్ డి ఆర్ ఎం రవికుమార్ క్లుప్తంగా వివరించారు .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత , ఉప సర్పంచ్, వార్డు మెంబెర్స్, రైతులు, మరియు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కీర్తన హెచ్ ఈ ఓ, వెటర్నరీ డాక్టర్ పి. ప్రియాంక , పామాయిల్ తోట ఆయిల్ ఫామ్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీధర్ , మండల వ్యవసాయ అధికారి ఎం శ్వేత కుమారి, ఎక్స్టెన్షన్ అధికారి రాజశేఖర్ గౌడ్, మరియు వ్యవసాయ ఇంజినరింగ్ కళాశాల విద్యార్థులు సుల్తాన్, వరప్రసాద్ రైతులుపాల్గొన్నారు.

నేడు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి కార్యక్రమాలు

0

ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్ 28, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ ప్రతినిధి (బుచ్చన్న)

నర్సాపూర్ నియోజకవర్గం లచ్చిరెడ్డిగూడెం, గోమారం, చండీ, కుకునూరు, జీ. పోచమ్మ తండా గ్రామాలలో సోమారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.గోమారం గ్రామంలో గోమారం, బిజిలిపూర్, సికింద్రాపూర్ గ్రామాలకు చెందిన గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ కిట్లను అందజేశారు.రత్నాపూర్, అహ్మెద్ నగర్ గ్రామాల్లో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

శివ్వాయిపల్లిలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం

0

ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్27, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీపీ ఆదేశాల మేరకు మెదక్ భరోసా సెంటర్ బృందం సోమవారం శివ్వాయిపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు లింగ వివక్షత, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, స్త్రీ వివక్ష, లింగ పక్షపాతం, పితృస్వామ్య వ్యవస్థ వంటి కీలక అంశాలపై సమగ్రంగా వివరించారు. మహిళలు మరియు బాలికల హక్కులు, భద్రత, సమానత్వం, చట్టపరమైన రక్షణ గురించి అవగాహన కల్పించారు.బాల్య వివాహాలను నిర్మూలించడం, మహిళలకు గౌరవం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. మహిళలపై వేధింపులు లేదా అన్యాయం జరిగిన సందర్భంలో వెంటనే పోలీసులను లేదా భరోసా సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, మహిళలు, యువతతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.