Wednesday, May 6, 2026
Home Blog Page 7

నిరుద్యోగ యువత సాధికారతకు ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం– కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్27, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో నిరుద్యోగ యువతకు సాధికారత కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజావాణి హాల్‌లో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ప్రకాశ్ రావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా యువతకు క్రమబద్ధమైన వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించేందుకు భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఎంపికైన ఇంటర్న్‌లకు నెలకు కనీసం ₹9,000 ఆర్థిక సహాయం, అదనంగా ₹6,000 పాకెట్ మనీ అందిస్తారని తెలిపారు.భారతదేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలో వివిధ రంగాలలో వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, పైలట్ దశలో ఇప్పటికే 300కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని వివరించారు. ప్రస్తుతం ఈ పథకం మూడవ దశ కొనసాగుతుండగా, కంపెనీలు నిరంతరం కొత్త అవకాశాలను ప్రకటిస్తున్నాయని చెప్పారు.18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల, పదో తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివిన అర్హులైన యువత అధికారిక వెబ్‌సైట్ (www.pminternship.mca.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. యువత తమ కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాశ్ రావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

0

ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్27 చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉక్కపోతతో ఉష్ణోగ్రతలు నమోదు కాగా సాయంత్రం 5 గంటలకు ఒకేసారి వాతావరణం చల్లబడింది. చిన్న శంకరంపేట మండలం మల్లు పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు. తడిసిన ధాన్యాన్ని కొట్టుకపోకుండా రైతులు తట్టలతో నీళ్లు తీసేస్తున్నారు. తరిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని రైతులు కోరారు.

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

0

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 27, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

హవేలీ ఘనపూర్, సోమవారం: హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు 65 మంది అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలలో భాగంగా చేపట్టిన “కళ్యాణ లక్ష్మి” పథకం ద్వారా పేద కుటుంబాల యువతులకు ఆర్థిక సహాయం అందించబడుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబాలపై వివాహ సమయంలో పడే ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయంతో వేలాది కుటుంబాలు లాభపడుతున్నాయని పేర్కొన్నారు.అలాగే, సమాజంలో అమ్మాయిల పట్ల గౌరవాన్ని పెంపొందించడంలో, బాల్య వివాహాలను తగ్గించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు అధికారులు మరింత కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.

సాంస్కృతిక కలలపై నైపుణ్యం ఉంచాలి

0

–సాంస్కృతిక కళ రాష్ట్ర శాఖ చైర్మన్ గుమ్మడి వెన్నెల కు సన్మానం

ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్ 27, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

సాంస్కృతిక కళ రాష్ట్ర శాఖ చైర్మన్ గుమ్మడి వెన్నెలకు సోమవారం మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రం నుంచి మెదక్ వెళుతూ మండల కేంద్రంలో ఆగారు. కాంగ్రెస్ నాయకులు తదితర నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, సముస్కృతిక కళలపై యువకులు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతి కార్యక్రమాలపై పెద్ద పీటా వేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శంభుని రాజ్ కుమార్ గౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు హలావత్ మోహన్ నాయక్, జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ముత్తిగల రామచంద్రం తో పాటు తదితరులు పాల్గొన్నారు.

బి ఆర్ ఎస్ పార్టీ గద్దె కూల్చడం పిరికిపంద చర్య.. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

0

ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్ 27,నర్సాపూర్ సీనియర్ జర్నలిస్ట్ (బుచ్చన్న)

తునికి లో బీఆర్ఎస్ పార్టీ గద్దె కూల్చడం పిరికి పంద చర్య అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల్లో రోజురోజుకీ పెరుగుతున్న అపారమైన మద్దతును తట్టుకోలేక, ప్రతిపక్షాలకు చెందిన కొందరు దురుద్దేశపూర్వకగ కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ పార్టీ దిమ్మెను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన ఖండనీయమైన చర్య.ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా అవమానపరిచే ఈ ఘటనను బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.దిమ్మెను ధ్వంసం చేసిన దుండగులను వెంటనే గుర్తించి, వారి వెనుక ఉన్న ప్రేరేపకులను కూడా బయటపెట్టి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు, ప్రభుత్వ అధికారులను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను .ఇలాంటి పిరికిపంద చర్యలతో బీఆర్‌ఎస్ పార్టీని మా కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం దెబ్బతీయలేరు. ప్రజల మద్దతుతో బీఆర్‌ఎస్ పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతుంది.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే,బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే గట్టిగా ప్రతిస్పందిస్తామని హెచ్చరిస్తున్నాము. ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నామ.

మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు–సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్

0

ఏ 2 డిజిటల్ న్యూస్, ఏప్రిల్27, చిన్న శంకరంపేట ప్రతినిధి ( కమ్మరి దేవరాజు)

ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సర్పంచ్ నాయిని ప్రవీణ్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, రైతులు తమ పంటను కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.

దళిత నాయకునికి అంబేద్కర్అవార్డు..సన్మానించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.

0

ఏ2 డిజిటల్ న్యూస్, ఏప్రిల్27, చిన్న శంకరంపేట (కమ్మరి దేవరాజ్)

స్పోర్ట్స్ సర్వీస్ సొసైటీ ఇండియా ఆధ్వర్యంలో దళిత నాయకుడు ముత్తిగళ్ళ రామచంద్రo కు మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సోమవారం శాలువాతో సన్మానించారు. ఈ అవార్డు వచ్చే నెల 14న అందించడంతో మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు మెదక్ వచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రామచంద్ర ఈ అవార్డు అందుకోవడం సంతోషకరమని తెలిపారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలతో ఎదగాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచ్ల పోరం అధ్యక్షుడు ఆవుల గోపాల్ రెడ్డి సంగాయపల్లి ఉప సర్పంచ్ కే. సాయిలు పాల్గొన్నారు.

మండలంలో ఘనంగా టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

0

ఏ2 డిజిటల్ న్యూస్, ఏప్రిల్27, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

భారత రాష్ట్ర సమితి పార్టీ దినోత్సవాన్ని సోమవారం మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద పార్టీ అధ్యక్షుడు పట్లో రాజు ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు హేమచంద్రo పతాకాన్ని ఆవిష్కరించారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో టిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అత్యంత ఘనంగా నిర్వహించారు వివిధ గ్రామాలలో టిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు మాట్లాడుతూ కేసిఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వాళ్ళమా దేశంలో తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే వాళ్ళమ్మ తెలంగాణ రాష్ట్ర సాధనకంటే ముందు దశాబ్దాలను నెమరు వేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చాటి చెప్పుకున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ వచ్చేది ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం కోసం రైతుబంధు రైతు బీమా ఏదింటి ఆడపిల్లల పెళ్ళికొరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రాష్ట్రంలో నీళ్లు లేక అల్లాడుతున్న ప్రజలకు మిషన్ భగీరథ పథకాలతో దేశంలో తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టాలని గుర్తించారు ఆయన చేసిన సేవలను కొనీయాదారు. గ్రామాలలో జై కేసీఆర్ అంటూ నినాదాలు మార్మోగాయి.

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

0

ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్ 27, శివంపేట ప్రతినిధి (రామకృష్ణ)

శివంపేట మండలంలో సోమవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని కొత్తపేట్‌తో పాటు మండల కేంద్రం శివంపేట మరియు ఇతర గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ వేడుకలను జరుపుకున్నారు.ఈ సందర్భంగా శివంపేట మండల మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ కోసం పుట్టి, తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించి, రాష్ట్ర పునర్నిర్మాణానికి కట్టుబడి పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, తిరిగి కే. చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మండలవ్యాప్తంగా ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0

ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్ 27, మనోహరబాద్ ప్రతినిధి (రామకృష్ణ)

మండలవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. కొండాపూర్, ముప్పిరెడ్డిపల్లి, మండల కేంద్రం మనోహరాబాద్ సహా పలు గ్రామాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ కోసం పుట్టి తెలంగాణ సాధించి, రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో తిరిగి పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.