Thursday, May 7, 2026
Home Blog Page 8

ఏడుపాయల జాతరలో చిన్నారి వెండి కడియాలు అపహరించేందుకు యత్నం –

0

అప్రమత్తమైన పోలీసులతో నిందితుడి పట్టివేత

ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్ 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ఆదివారం జరిగిన ఏడుపాయల వనదుర్గామాత జాతరలో అపహరణ యత్నం చోటుచేసుకుంది. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో, పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం మాదిరిగానే క్విక్ రెస్పాన్స్ టీమ్ (QRT) సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో, ఒక తల్లి షాపులో కొనుగోళ్లు చేస్తున్న సమయంలో ఆమెతో ఉన్న చిన్నారిని ఓ దుండగుడు ప్రక్కకు తీసుకెళ్లాడు. చిన్నారి కాళ్లలో ఉన్న వెండి కడియాలను అపహరించి, వాటిని తన లోదుస్తుల్లో దాచుకున్నాడు.విధుల్లో ఉన్న QRT సిబ్బంది ఈ అనుమానాస్పద కదలికలను గమనించి వెంటనే స్పందించారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, మొదట అతను తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా చిన్నారి వద్ద నుంచి అపహరించిన రెండు వెండి కడియాలు అతని వద్ద లభించాయి.పోలీసులు వెంటనే ఆ వెండి కడియాలను చిన్నారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనను చూసిన భక్తులు పోలీస్ సిబ్బంది అప్రమత్తతను, సమయస్ఫూర్తిని ప్రశంసించారు.అనంతరం నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం పాపన్నపేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జాతర సందర్భంగా భక్తులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

సూపర్ పోలీస్ పనితీరు… చోరీ ఫోన్ పది రోజుల్లో రికవరీ

0

ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్ 26 నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ ప్రతినిధి (బుచ్చన్న)

నర్సాపూర్ నియోజకవర్గం, కొల్చారం మండలంలో పోలీసులు మరోసారి తమ చురుకైన పనితీరును చాటుకున్నారు. చోరీకి గురైన ఒక సెల్‌ఫోన్‌ను కేవలం పది రోజుల్లోనే రికవరీ చేసి యజమానికి అప్పగించారు.అప్పాజిపల్లి గ్రామానికి చెందిన తిమ్మకపల్లి గోపాల్ ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. అనంతరం సాంకేతిక ఆధారాల సహాయంతో వేగంగా దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఫోన్‌ను ఉపయోగిస్తున్న వ్యక్తిని గుర్తించి పట్టుకుని, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు.తరువాత ఆ మొబైల్ ఫోన్‌ను ఏఎస్‌ఐ సుధాకర్ చేతుల మీదుగా యజమానికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన చర్యలపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, “మొబైల్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే రికవరీ త్వరగా సాధ్యమవుతుంది” అని ప్రజలకు సూచించారు.

మంత్రిని కలిసిన సర్పంచ్ వెంకట్ గౌడ్ నాయకులు దుర్గేష్ ముదిరాజ్

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 26, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ను కాంగ్రెస్ నాయకులు అప్పాజిపల్లి సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్,(గజినీ) మెదక్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పుల్లబోయిన దుర్గేష్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మండల అభివృద్ధి పనుల కోసం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అనంతరం ఇటీవల మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియామకం అయిన పుల్లబోయిన దుర్గేష్ ముదిరాజ్ ని మంత్రి అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసే నాయకులను గుర్తించి వారికి పార్టీ సముచిత స్థానంకల్పిస్తుందనిపేర్కొన్నారు.

వాసవి మాత జయంతి ఘనంగా నిర్వహణ – మెదక్ కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, మెదక్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష దశమి నాడు వాసవి మాత జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకమని తెలిపారు. ఆర్యవైశ్యుల కులదేవతగా వాసవి మాతకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, డిపిఆర్‌ఓ రామచంద్ర రాజు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పల్లెర్ల రవీందర్, ప్రధాన కార్యదర్శి బుక్క అశోక్, కోషాధికారి మరుమల్ల అశోక్, ఉత్సవ కమిటీ చైర్మన్ రాయకంటి నాగరాజు, పట్టణ కార్యదర్శి బచ్చు పార్థివనాథ్, ఉప్పల శ్రీకాంత్, కోవురి శ్రీనివాస్, షిర్నా రాజేశ్వర్, చంద్రపాల్, మేడం బాలకృష్ణ, రాగి అశోక్, వుట్కురి వీరేశం, కౌన్సిలర్ శివరామకృష్ణ, కొండా శ్రీనివాస్, పురం వెంకట నారాయణ, కొమ్మ వెంకటేష్, బజ్జూరి బిక్షపతి, మురళి, పొగాకు రామకృష్ణ, వనజ, సుష్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

జనాభా లెక్కలు 2027: ఆన్‌లైన్ స్వీయ నమోదు ప్రారంభం

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

భారత ప్రభుత్వం ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే జాతీయ జనగణన కార్యక్రమం (Census–2027) ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ఈసారి అందుబాటులోకి వచ్చిన డిజిటల్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ (Self Enumeration) సౌకర్యాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కోరారు.డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ఈ సదుపాయం ద్వారా ప్రజలు తమ ఇంటి వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం వంటి అంశాలను ఆన్‌లైన్‌లోనే సులభంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్ https://se.census.gov.in/ అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. స్వయంగా నమోదు చేసుకునే ప్రక్రియలో భాగంగా ముందుగా పోర్టల్‌లోకి వెళ్లి, తమకు అనుకూలమైన భాషను ఎంపిక చేసుకోవాలి. అనంతరం మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీ సహాయంతో లాగిన్ అయి, జిల్లా, పిన్ కోడ్, గ్రామం వంటి వివరాలను నమోదు చేయాలి. మ్యాప్‌లో తమ నివాసాన్ని గుర్తించి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేసి వివరాలను సమర్పించాలి. చివరగా మొబైల్‌కు వచ్చే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ (SE ID)ను భద్రపరచుకోవాలని కలెక్టర్ సూచించారు. జనగణనలో భాగంగా ఇంటి నిర్మాణం, వసతి సౌకర్యాలు, కుటుంబ సభ్యుల సంఖ్య, విద్యుత్, తాగునీటి వనరులు, మరుగుదొడ్డి సదుపాయం, వంట ఇంధనం, ఇంటర్నెట్ వినియోగం, వాహనాల వివరాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసినప్పటికీ, ప్రభుత్వం నియమించిన ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటిని సందర్శించి వాటిని ధృవీకరిస్తారని చెప్పారు. ఆ సమయంలో ప్రజలు తమ SE IDను చూపించి సహకరించాలని కోరారు. జనగణన ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఈ ప్రక్రియలో పాల్గొని, సరైన వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ విజ్ఞప్తి చేశారు.

పులిమామిడి గ్రామంలో ఘనంగా పంచాయతీ రాజ్ దినోత్సవం – గ్రామ సభలో అభివృద్ధి అంశాలపై చర్చలు

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో శుక్రవారం పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుపై గ్రామ ప్రజలతో కలిసి విస్తృతంగా చర్చలు జరిపారు.ఈ కార్యక్రమం సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో, గ్రామ సెక్రటరీ సబితా సమన్వయంతో జరిగింది. సభలో గ్రామానికి సంబంధించిన ముఖ్య సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రజల నుంచి సూచనలు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముద్దురి రాజు, వార్డు సభ్యులు మంగళి లక్ష్మణ్, అబ్రమైన యశోద, గొర్రె శ్రీహరి, గొర్రె ఎల్లవ్వ, బండ్ల వేణు, తొయేటి రాధకృష్ణ, కొమ్ము కవిత తదితరులు పాల్గొన్నారు.

నైపుణ్యాల పెంపుతోనే యువతకు ఉపాధి అవకాశాలు: కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమకు నచ్చిన రంగాలలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటేనే మెరుగైన ఉద్యోగ అవకాశాలు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు.99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారంలో, శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజావాణి హాల్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో యువతకు నైపుణ్యాభివృద్ధి మరియు స్వయం ఉపాధి పథకాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన వివిధ కళాశాలల యువతకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు సాంకేతిక మరియు వ్యవస్థాపక నైపుణ్యాలలో ఉచిత శిక్షణ అందించి ఉపాధి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న నేపథ్యంలో, యువత కంప్యూటర్ కోర్సుల్లో ప్రావీణ్యం సాధించి పోటీ ప్రపంచంలో నిలబడాలని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.అంతకుముందు ఐటీసీ సంస్థ ప్లాంట్ మేనేజర్ ఆనంద్, టెక్నీషియన్ శివయ్య నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగాలు పొందే విధానంపై వివరించారు. ఐటీసీ సంస్థలో 50 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల యువత నుండి అర్హత పత్రాలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు మరియు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.

నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం: కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం “ఇందిరమ్మ ఇళ్ల పథకం”ను అమలు చేస్తోందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.మెదక్ మండలం శివాయపల్లి గ్రామంలో శుక్రవారం పండుగ వాతావరణంలో నిర్వహించిన ఇందిరమ్మ గృహ లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని గృహాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల సంక్షేమ వారోత్సవాల సందర్భంగా జిల్లాలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో శివాయపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారు తోట లక్ష్మి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, సొంత స్థలం ఉన్నప్పటికీ ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యతనిస్తూ గృహాలను మంజూరు చేస్తున్నామని చెప్పారు. గృహ నిర్మాణం కోసం ప్రభుత్వం విడతల వారీగా నిధులు విడుదల చేస్తోందని, ఒక్కో గృహానికి రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 750 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తవగా, అందులో 650 గృహాలకు గృహప్రవేశాలు నిర్వహించామని తెలిపారు. మిగిలిన వారు కూడా త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, హౌసింగ్ పీడీ మాణిక్యం, గ్రామ సర్పంచ్, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యాన్ని తొలగించాలి

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 23,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

రహదారి భద్రత లో భాగంగా చిన్న శంకరంపేట మండలంలోని ప్రతి గ్రామంలోని రోడ్లపై వరి ధాన్యం మక్కలు ఆరబెట్టిన రైతులకు ధాన్యాన్ని తొలగించాలని పోలీసులు నోటీసులు గురువారం అందించారు. ప్రతి గ్రామంలో అవగాహన కోసం చాటింపు వేయాలని సర్పంచ్లకు కార్యదర్శులకు పోలీసులు సమాచారం అందించారు. రోడ్లపై వాహనదారులు ఆరబెట్టిన ధాన్యం కుప్పలను ఢీకొని మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని, భద్రతలో భాగంగా రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు బాటసారులకు ఇబ్బందులు కలగవద్దని సాఫీగా ప్రయాణం చేయుటకు ఈ ముఖ్య ఉద్దేశం అన్నారు.

పారదర్శకతతో జనగణన నిర్వహణకు తాసిల్దార్లు చిత్తశుద్ధితో పని చేయాలి

0

డ్రైలాండ్–వెట్ ల్యాండ్ సర్వేలో ముందుచూపు అవసరం: కలెక్టర్

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 23, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పలు ముఖ్య అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జనగణన, డ్రైలాండ్–వెట్ ల్యాండ్ సర్వే, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు, ఖరీఫ్ సీజన్‌కు రైతులకు విత్తనాలు–ఎరువుల సరఫరా, ధాన్యం కొనుగోలు, ఓటర్ మ్యాపింగ్, గ్యాస్ సరఫరా, భూభారతి–సాదా బైనామా పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జనగణన పారదర్శకంగా నిర్వహించేందుకు తాసిల్దార్లు ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ప్రశ్నోత్తరాల రూపంలో తెలుసుకుంటూ, శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సమర్థవంతమైన జనగణనే లక్ష్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు.జిల్లాలోని 606 చెరువుల సంరక్షణలో భాగంగా డ్రైలాండ్–వెట్ ల్యాండ్ సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్ర నిధుల సాధనకు అవకాశం ఉండటంతో రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో కమిటీ ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఖరీఫ్ సీజన్‌కు రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొరత లేకుండా బఫర్ స్టాక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.జిల్లాలో ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు 525 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, 143 మంది రైతుల నుండి 11 కేంద్రాల ద్వారా 887 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. గన్ని బ్యాగుల కొరత లేదని, మిల్లర్లు సహకరిస్తున్నారని చెప్పారు.గృహ అవసరాల గ్యాస్ సరఫరా విషయంలో వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన నిల్వలు ఉంచాలని అధికారులను ఆదేశించారు.భూభారతి మరియు సాదా బైనామా పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సక్సెషన్, మ్యుటేషన్, ఖాతా సమీకరణ, డేటా సవరణ, అర్బన్ ల్యాండ్, కోర్టు కేసులు తదితర అంశాలలో పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు. సాదా బైనామా పరిష్కారంలో జాగ్రత్తగా వ్యవహరించి, లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని తెలిపారు.ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణలో బీఎల్వోలు ఇంటింటి సందర్శనలు నిర్వహించి వివరాలను సరిగ్గా నమోదు చేయాలని సూచించారు. అర్బన్, రూరల్ ప్రాంతాల డేటాను సమగ్రంగా పరిశీలించి వందశాతం లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు.ఈ సమీక్ష సమావేశంలో డీఎఫ్ఓ జోజి, డిఆర్డిఓ శ్రీనివాసరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్, డీఎం జగదీష్, డిపిఓ యాదయ్య, పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, సిపిఓ సురేష్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి, డీఎం ఆర్టీసీ సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, తాసిల్దార్లు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.