Wednesday, May 6, 2026
Home Blog Page 2

నూతన ఎస్సై శివానందం సన్మానించిన అంబేద్కర్ సంఘం నాయకులు

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 5, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

బాధ్యతలు స్వీకరించిన శివానందంను అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి బందెల సాయిలు, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రం, అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గపతి, అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కర్రె సత్తయ్య, మెదక్ కాన్స్టెన్సీ ఇంచార్జి కర్ణ సాయిలు, అంబేద్కర్ సంఘం జిల్లా కార్యదర్శి బందెల సుధాకర్, అంబేద్కర్ సంఘం నాయకులు జనార్ధన్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ అవార్డు గ్రహీతను సన్మానించిన ఎస్సై శివానందం

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 5, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు మూత్తిగల రామచంద్రంకు అంబేద్కర్ అవార్డుకు ఎంపిక కావడంతో ఆయనను స్థానిక ఎస్సై శివానందం మంగళవారం పోలీస్ స్టేషన్లో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి బందెల సాయిలు, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రం, అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బిక్షపతి, అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కర్రె సత్తయ్య, మెదక్ అసెంబ్లీ ఇంచార్జి కర్నే సాయిలు, అంబేద్కర్ సంఘం జిల్లా కార్యదర్శి బందెల సుధాకర్, అంబేద్కర్ సంఘం నాయకులు జనార్ధన్, నర్సింలు,బిందెలు ప్రభాకర్,వడ్ల శ్రీనివాస్,పడాల శ్యాం, వెన్నెల, తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్ బాలల సంరక్షణ కేంద్రాల పనితీరు మెరుగుపర్చాలి: సీతా దయాకర్ రెడ్డి

0

ఏ 2డిజిటల్ న్యూస్, మే 5, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

బాలల సంరక్షణ కేంద్రాల పనితీరు మరింత మెరుగుపడే దిశగా చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలో ఆమె ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు కంచర్ల వందన గౌడ్, మర్రిపల్లి చందన, ఆపర్ణ, బి. వచన్ కుమార్ విస్తృతంగా పర్యటించారు.నర్సాపూర్ పర్యటనకు విచ్చేసిన చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డికి మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ స్వాగతం పలికారు. ముందుగా పట్టణంలోని వికాసం వికలాంగుల పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఆమె, బాలబాలికల సంరక్షణ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు.ఈ సందర్భంగా శారీరక వైకల్యం కలిగిన చిన్నారిని చూసి చలించిన చైర్‌పర్సన్, ఆ చిన్నారికి అవసరమైన శస్త్రచికిత్స చేయించి, పౌష్టికాహారం అందిస్తూ, విద్యాబుద్ధులు నేర్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.అనంతరం భవిత కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. భవిత కేంద్రాలు ఆదర్శవంతంగా పనిచేస్తున్నాయని, చిన్నారులకు ఆటపాటలతో కూడిన నైపుణ్యాలు నేర్పుతున్నారని ఆమె హర్షం వ్యక్తం చేశారు. అలాగే శివంపేటలోని బేతని సంరక్షణ ఆశ్రమాన్ని కూడా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. కమిషన్ సభ్యులు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ బాలల హక్కుల ఉల్లంఘనలు, పౌష్టికాహార లోపం వంటి అంశాలను పరిశీలిస్తున్నారని చెప్పారు. బాలలకు మెరుగైన విద్య, ఆరోగ్యం, సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యమని, పిల్లలపై దాడులను అరికట్టేందుకు కమిషన్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.అలాగే ప్రతి ఆరు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి సంరక్షణ కేంద్రాల పనితీరును సమీక్షిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ అధికారి హేమ భార్గవి, రామాయంపేట సీడీపీఓ స్వరూప, డీసీపీఓ నాగరాజు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం.. సిపిఎం జిల్లా కమిటీ

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 4, సీనియర్ జర్నలిస్ట్ (బుచ్చన్న)

వడ్ల కొనుగోళ్లు కేంద్రాలలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం సోమవారం మెదక్ మండలం చిట్యాల జనకంపలి గ్రామాల లో కొనుగోలు కేంద్రాలను సీపీఎం జిల్లా కమిటీ సందర్శిచింది ఈసందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ మాట్లాడుతూ జిల్లాలో కొనుగోలు కేంద్రలలో రైతులు ఇబందులకు గురౌతున్నారు వడ్లు కంటా అయిన తరువాత సంచులు కళ్లల్లో ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు లారీలు రకపోవం మూలంగా కంటా అయిన వడ్లు కళ్లలోనే ఉంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు వడ్ల కొనుగోలు సౌకర్యాలు కలిపించడంలో ప్రభుత్వ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు రైతులకు తపర్లు టెంటు మంచినీళ్లు ఓ ఆర్ ఎస్ (ors) ప్యాకెట్లు వడదెబ్బ మాత్రలు లాంటి సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తంచేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె. మల్లేశం జిల్లా కమిటీ సభ్యులు జె సంతోష్ సీహెచ్ అజాయ్ మధు లక్సీమితదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం

0

బాధితులకు భరోసా కల్పించిన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు

ఏ2డిజిటల్ న్యూస్, మే 4, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపించాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీకి నేరుగా వినిపించారు.ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదుదారునితో వ్యక్తిగతంగా మాట్లాడిన ఎస్పీ, వారి సమస్యలను సమగ్రంగా తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొన్ని సమస్యలపై సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్‌లో మాట్లాడి, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.ప్రజలకు ఎల్లప్పుడూ పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని, ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా నేరుగా అధికారులను సంప్రదించాలని ఎస్పీ స్పష్టం చేశారు. చట్టపరమైన విధానంలో ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు.ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కారమై, ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం పెరిగిందని ఎస్పీ పేర్కొన్నారు.

మండలంలో ఐదు రైతు వేదికలలో రైతు వారోత్సవాలు: ఏవో శ్వేతా కుమారి

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 4, సీనియర్ జర్నలిస్ట్ (బుచ్చన్న)

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజులు మండలంలోని 5 రైతు వేదికలలో రైతు వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాస్త్రవేతలు పలు అంశాలను గురించి చర్చించారు ప్రకృతి వ్యవసాయం, వరి పంటలో వచ్చే చీడ పీడ గురించి, మార్కెట్ ప్రేఫరెడ్ వరి రకాల గురించి, సమతుల్య ఎరువుల వినియాగం, మట్టి నమూనా సేకరణ, మట్టి నమూనా కార్డు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో వ్యవసాయ యూనివర్సిటీ సైంటిస్ట్ డి ఆర్: బాలాజీనాయక్, డి ఆర్: రాజేంద్ర మరియు ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్. రుద్రమూర్తి కూల్చారం, పోతిరెడ్డిపల్లి, జలల్పూర్, అంశానపల్లి సర్పంచులు, ఉపసర్పంచులు, రైతులు, మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి, ప్రకృతి వ్యవసాయ కృషి సఖిస్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.అలాగే సోమవారం కొంగోడు గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవెత్తలు ప్రోగ్రాంలో భాగంగా డిఆర్: సతీష్ మరియు సిహెచ్ రమ్య శ్రీ పాల్గొని రైతులకు పంటలలో నీటి యాజమాన్యం పద్ధతుల గురించి, పచ్చి రొట్టె ఎరువుల వాడకం, పంట మార్పిడి తదితర అంశాలను గురించి చర్చించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, రైతులు పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి —జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2డిజిటల్ న్యూస్ మే 4 సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)

ఎక్కువ ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమ సింగ్ సూచించారు.భూసార పరీక్షల విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవ కార్యక్రమాలు మెదక్ జిల్లాలో పలురైతువేదికలలోఘనంగా జరుగుతున్నాయి.సోమవారం మెదక్ కలెక్టర్ ప్రతిమ సింగ్ కౌడిపల్లి రైతు వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటలైన కూరగాయలు, పూల మొక్కలు సాగు చేసుకోవాలని సూచించారు. కౌడిపల్లి, చేగుంట, తూప్రాన్ లో కొందరు రైతులు ఆ దిశగా సాగు చేస్తున్నారని పేర్కొన్నారు.మెదక్ జిల్లా హైదరాబాద్ కు దగ్గరలో ఉంది కనుక మార్కెట్ చేసుకోవడానికి సులువుగాఉంటుందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రైతు వారోత్సవాలు–2026” కార్యక్రమాన్ని జిల్లాలో మే 04 నుండి మే 09 వరకు అన్నిమండలాలు,గ్రామపంచాయతీలు, రైతు వేదికలు, క్లస్టర్ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రజాభిమానాన్ని పొందేలా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.ప్రస్తుత పరిస్థితుల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు శాస్త్రీయ పద్ధతులు అవలంబించడం అత్యవసరమని తెలిపారు. అందుకోసం రైతు వారోత్సవాల ద్వారా ప్రతి రైతుకు నేరుగా చేరుకుని, క్షేత్రస్థాయిలో సమగ్ర అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.జిల్లాలోని ప్రతి గ్రామంలో ఒక్క రైతు కూడా మిగలకుండా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, రైతు వేదికలను కేంద్రబిందువుగా చేసుకుని రైతులతో ముఖాముఖి సమావేశాలు, క్షేత్ర ప్రదర్శనలు, సాంకేతిక సదస్సులు, ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, మండల సర్పంచుల పూర్ణ అధ్యక్షులు కౌడిపల్లి సర్పంచ్ కృష్ణ గౌడ్ స్థానిక వ్యవసాయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం – కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 4, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

రైతులు అధిక ఆదాయం పొందేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల సందర్భంగా సోమవారం కౌడిపల్లి రైతు వేదికలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంప్రదాయ పంటలతో పాటు కూరగాయలు, పూల మొక్కల వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ఇప్పటికే కౌడిపల్లి, చేగుంట, తూప్రాన్ ప్రాంతాల్లో కొంతమంది రైతులు ఈ దిశగా సాగు చేస్తున్నారని తెలిపారు. మెదక్ జిల్లా హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం వల్ల పంటలను మార్కెట్ చేయడం సులభమని పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రైతు వారోత్సవాలు–2026” కార్యక్రమం జిల్లాలో మే 4 నుండి మే 9 వరకు అన్ని మండలాలు, గ్రామపంచాయతీలు, రైతు వేదికలు, క్లస్టర్ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు శాస్త్రీయ పద్ధతులు అవలంబించడం అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. రైతు వారోత్సవాల ద్వారా ప్రతి రైతుకు నేరుగా చేరుకుని అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో ప్రతి గ్రామంలోని రైతులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, రైతు వేదికల ద్వారా సమావేశాలు, క్షేత్ర ప్రదర్శనలు, సాంకేతిక సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, స్థానిక వ్యవసాయ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

రైతులకు మట్టి నమూనా సేకరణ పై అవగాహన –వ్యవసాయ అధికారి లక్ష్మి ప్రవీణ్

0

ఏ2డిజిటల్ న్యూస్, మే4, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

రైతులు రసాయన ఎరువులు తగ్గించి పకృతి వ్యవసాయం వైపు వెళ్లడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయ అధికారి లక్ష్మి ప్రవీణ్ అన్నారు. రైతు వారోత్సవాల్లో భాగంగా సోమవారం రైతు వేదికలో రైతులకు మట్టి నమూనా పై అవగాహన కల్పించారు. రైతులు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పంటలు పండించాలని సూచించారు. రైతులకు మట్టి నమూనా కొలది పంటలు పండించాలని తెలిపారు. రైతులు నేల పరీక్షల ఆధారంగానే ఎరువులు వాడాలని అధిక యూరియాకు బదులు నానో ఎరువులు సహజ వ్యవసాయ పద్ధతులు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, తోపాటు వివిధ గ్రామాల సర్పంచులు రైతులు పాల్గొన్నారు.

నృత్య దినోత్సవం సందర్భంగా టెంపుల్ డాన్స్ కళాకారుల ప్రతిభ

0

ఏ2 డిజిటల్ న్యూస్, మే4, ప్రత్యేక ప్రతినిధి (మల్పర్తి రాoచందర్)

ప్రపంచ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మన రాష్ట్రానికి చెందిన టెంపుల్ డాన్స్ కళాకారులు కేరళ రాష్ట్రంలో తమదైన ప్రతిభను కనబరిచి పలువురి ప్రశంసలకు పాత్రులయ్యారు. ఏప్రిల్ 27, 28, 29 తేదీల్లో కేరళ రాజధానితిరువనంతపురంలో కేరళ భాషా సాంస్కృతిక శాఖ, నాదం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో హన్మకొండ కు చెందిన ”ది టెంపుల్ డాన్స్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ” విద్యార్థులు కూచిపూడి విభాగంలో తమదైన ప్రతిభను ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు. కూచిపూడి విభాగంలో సీనియర్ కేటగిరీలో అనిశ్రిత, యజ్ఞశ్రీ, సాయిత్రిపురలు ప్రథమ బహుమతి పొందగా, జూనియర్ విభాగంలో ఆరుషి రెడ్డి, చన్విత, వరునికలు ప్రథమ బహుమతి, స్ఫూతినిశ్రీ రెడ్డి, శ్రీనిధి, శ్రీరైఖ్యా రెడ్డి లు ద్వితీయ బహుమతి, సబ్ జూనియర్ విభాగంలో ఆరాధ్య, శ్రీయాంక, శ్రుత కీర్తి ప్రథమ బహుమతి, సత్య కృతి, శ్లోకా రెడ్డిలు ద్వితీయ బహుమతులు పొందారు. వీరు నాట్య చారిని కాట్రగడ్డ హిమాన్షి ఆధ్వర్యంలో బహుమతులను అందుకున్నారు. ఈ సందర్భంగా నాట్యాచారిని హిమాన్షి మాట్లాడుతూ తమ విద్యార్థులు కేరళలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరచడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.