Wednesday, May 6, 2026
Home Blog Page 23

99 రోజుల పరిపాలనలో భాగంగా పులిమామిడిలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు

0

ఏ2టీవీ న్యూస్,మార్చి14 మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో 99 రోజుల పరిపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామాభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గ్రామ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి వార్డులో జెసిబి యంత్రాలతో పనులు నిర్వహిస్తూ వాడలు, కాల్వలు మరియు రహదారులను శుభ్రం చేయిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని వార్డుల్లో శుభ్రత పనులు క్రమంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

గ్యాస్ కొరతపై అపోహలు వద్దు… రాష్ట్రంలో సరిపడా ఎల్‌పీజీ నిల్వలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

0

ఏ2టీవీ న్యూస్, మార్చ్13, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత ఉందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.అమెరికా–ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడిందనే వార్తలు పూర్తిగా అపోహలేనని శుక్రవారం తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.రాష్ట్రంలో బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత లేదని, వినియోగదారులకు సరిపడా ఎల్‌పీజీ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం వల్లే కృత్రిమ కొరత వాతావరణం సృష్టించబడుతోందని అన్నారు.అపోహలను అడ్డుపెట్టుకుని గ్యాస్ నిల్వ చేయడం లేదా బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 288 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు.మెదక్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకావద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.

పదకొండవ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు

0

జిల్లాలో హాజరు శాతం 96.71 – ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి.

ఏ2టీవీ న్యూస్, మార్చ్12, మెదక్ జిల్లా ప్రతినిధి(రాము)

జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షలు పదకొండవ రోజు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు. ఈరోజు జరిగిన రెండవ సంవత్సరం కెమిస్ట్రీ–I, కామర్స్–I పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా జరిగాయని వెల్లడించారు.మొదటి సంవత్సరం పరీక్షల్లో జనరల్ విభాగంలో మొత్తం 6085 మంది విద్యార్థుల్లో 5895 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 279 మందిలో 260 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. జిల్లాలో పదకొండవ రోజు మొత్తం హాజరు శాతం 96.71 శాతంగా నమోదైనట్లు తెలిపారు.ఈరోజుతో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం అమలులో ఉన్న ఐదు నిమిషాల నిబంధన కారణంగా విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాశారని చెప్పారు.జిల్లాలోని వివిధ పరీక్షా కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం పర్యవేక్షించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

మెదక్‌లో పోలీసు క్రీడలు… డీపీవో–డిఏఆర్ మధ్య ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్.

0

ఏ2టీవీ న్యూస్, మార్చ్12, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్న పోలీసు క్రీడా పోటీల్లో మూడవ రోజు ఉత్కంఠభరితంగా కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా మెదక్‌లోని వేస్లీ కళాశాల మైదానంలో డీపీవో మెదక్ మరియు డిఏఆర్ మెదక్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ గురువారం ప్రారంభమైంది.మూడు రోజులుగా జరుగుతున్న ఈ పోలీసు క్రీడా పోటీలకు సిబ్బంది నుంచి మంచి స్పందన లభించింది. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, క్రీడలు సిబ్బందిలో ఐక్యతను పెంపొందించడమే కాకుండా ఆరోగ్య పరిరక్షణకు కూడా ఎంతో దోహదపడతాయని తెలిపారు. విధుల్లో ఉండే ఒత్తిడిని తగ్గించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.మొత్తానికి పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్న ఈ క్రీడా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.

పులిమామిడి గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం – రోడ్లు, మురికికాలువల శుభ్రపరచింపు

0

ఏ2టీవీ న్యూస్, మార్చి12, మెదక్ జిల్లా ప్రతినిధి(రాము)

మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో 99వ ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.గ్రామ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జెసిబి యంత్రంతో గ్రామంలోని రోడ్లను శుభ్రపరచడంతో పాటు మురికికాలువలను కూడా శుభ్రం చేయించారు.గ్రామంలో పరిశుభ్రతను కాపాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రెటరీ సబిత, సర్పంచ్‌ రావి పల్లి శ్రీనివాస్ రెడ్డి తో పాటు వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మెదక్ జిల్లాలో శిశువును అమ్మిన ఘటన వెలుగు..

0

ఏ2టీవీ న్యూస్, మార్చి11, మెదక్ జిల్లా ప్రతినిధి రాము

మెదక్ జిల్లా హావేలీఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శిశువును అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చింది.హావేలీఘనపూర్ మండలం లింగసాస్ పల్లి తాండకు చెందిన కేతావత్ మంజుల, ఆమె భర్త మహేష్ దంపతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ ఒక నెల మగ శిశువును అమ్మినట్టు పోలీసులు తెలిపారు.మంజుల నెల రోజుల క్రితం మెదక్ మాతా–శిశు సంరక్షణ కేంద్రంలో ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే గత వారం రోజులుగా అంగన్వాడీ కేంద్రంలో లభించే అనుబంధ పోషకాహారం కోసం మంజుల రాకపోవడంతో అంగన్వాడీ టీచర్ ఆమె ఇంటికి వెళ్లి విచారించింది. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఈ విషయాన్ని ఐసిడిఎస్ సెక్టార్ ఇంచార్జ్ పర్ల విజయలక్ష్మికి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో మార్చి 4న మెదక్ పట్టణంలోని కీర్తి టేకర్ వద్ద మంజుల, ఆమె భర్త మహేష్ కలిసి హావేలీఘనపూర్‌కు చెందిన కుమ్మరి నాగరాజు, అతని భార్య స్వప్నతో తమ మగ శిశువును అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నారు. మొదట ఐదు లక్షల రూపాయలకు మాట్లాడుకున్నప్పటికీ, చివరకు ఒక లక్ష యాభై వేల రూపాయలకు బేరం కుదిరింది. అనంతరం హావేలీఘనపూర్ మండలం శాలిపేట గ్రామ శివారులో స్టాంప్ పేపర్‌పై ఒప్పందం రాసుకొని దంపతులు సంతకాలు చేసి శిశువును వారికి అప్పగించారు. మార్చి 9న చేగుంట బస్ స్టాప్ వద్ద ఉన్న మంజుల, మహేష్‌లను ఐసిడిఎస్ సెక్టార్ ఇంచార్జ్ పర్ల విజయలక్ష్మి గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. పోలీసులు విచారణ జరపగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ శిశువును అమ్మినట్టు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు.తర్వాత మధ్యవర్తులైన కుమ్మరి నాగరాజు, అతని భార్య స్వప్నలను పోలీసులు విచారించగా, కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం కంచర్ల గ్రామానికి చెందిన నరసొల్ల రాజు, అతని భార్య నరసొల్ల స్వప్నకు పిల్లలు లేకపోవడంతో వారికి శిశువును అప్పగించినట్టు వెల్లడించారు. దీంతో ఎస్సై సత్యనారాయణ సిబ్బందితో కలిసి భిక్నూర్ మండలం కంచర్ల గ్రామానికి వెళ్లి నరసొల్ల రాజు వద్ద నుంచి మగ శిశువును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శిశువును సఖి కేంద్రం ద్వారా తల్లి కేతావత్ మంజులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కుల్చారం మండలంలో భద్రత పెంపు…32 సీసీ కెమెరాల ప్రారంభం.

0

ఏ2టీవీ న్యూస్, మార్చి11,మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కుల్చారం మండలంలో కీలక చర్యలు చేపట్టారు. ఏడుపాయల టీ జంక్షన్ నుండి రెండవ బ్రిడ్జ్ వరకు మొత్తం 32 కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ప్రారంభించారు. ఈ కెమెరాల ద్వారా వాహనాల రాకపోకలు, ప్రజల కదలికలను నిరంతరం పర్యవేక్షించే అవకాశం కలుగుతుంది. అలాగే అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలను సులభంగా గుర్తించే విధంగా పోలీసులకు సహాయపడతాయి. నేరాలను నిరోధించడం, గుర్తించడం మరియు చట్టం-సువ్యవస్థను కాపాడడంలో ఈ సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించనున్నాయి. నేరాల దర్యాప్తు మరియు విచారణలో కూడా పోలీసులకు ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయి. ఈ సందర్భంగా ప్రజలు కూడా పోలీసులకు సహకరించి శాంతి భద్రతలను కాపాడటంలో భాగస్వాములు కావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

గ్రామపంచాయతీకి విచ్చేసిన తహసీల్దార్ శ్రీనివాసాచారికి ఘన స్వాగతం.

0

ఏ 2 టీవీ న్యూస్ మార్చి 10 మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

కొల్చారం మండల తహసీల్దార్ శ్రీనివాసాచారి గ్రామపంచాయతీ కార్యాలయానికి మొట్టమొదటిసారిగా విచ్చేయగా, గ్రామ సర్పంచ్ పాతురి దయాకర్ గౌడ్, ఉప సర్పంచ్ మరియు గ్రామ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నూతన గ్రామ సర్పంచ్ పాతురి దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీనివాసాచారిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధికి అధికారులు సహకరించాలని కోరుతూ గ్రామ సమస్యలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

భూ హక్కుల రక్షణకే రీసర్వే కార్యక్రమం: జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.

0

ఏ 2 టీవీ న్యూస్ మార్చి 10, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

భూ హక్కులను పక్కాగా నిర్ధారించేందుకు ప్రభుత్వం భూ రీసర్వే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీసర్వే అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుమారు 100 సంవత్సరాల క్రితం నిజాం ప్రభుత్వ కాలంలో 35 నుంచి 40 సంవత్సరాల పాటు కష్టపడి భూమి నక్షాలను రూపొందించారని చెప్పారు. అప్పటి నుంచి కొన్ని గ్రామాల్లో భూ నక్షాల్లో సమస్యలు ఏర్పడినట్లు తెలిపారు. ఆ సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకే భూ రీసర్వే కార్యక్రమాన్ని శాస్త్రీయంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.ప్రతి భూకమతానికి సంబంధించిన వివరాలను ఆన్లైన్ డిజిటలైజేషన్ ద్వారా నమోదు చేసి, భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూమి ప్రతి రైతుకు ఎంతో విలువైన ఆస్తి అని, రైతుల భూ హక్కులను పరిరక్షించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.జిల్లాలో 24 గ్రామాల్లో భూ రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల భూ హక్కులను కాపాడుతామని చెప్పారు. రీసర్వే అనంతరం విదేశాల్లో ఉన్నవారు సైతం తమ భూములను ఆన్లైన్ ద్వారా సులభంగా పరిశీలించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

చెల్మెకుంట అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం.

0

ఏడుపాయల సమీపంలో ఘటన – గుర్తు తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి

ఏ 2 టీవీ న్యూస్ మార్చి 10 మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ఏడుపాయల సమీపంలోని చెల్మెకుంట వద్ద గల అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.మహిళ వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతురాలి వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, మృతురాలి గురించి ఎవరికైనా సమాచారం ఉంటే పాపన్నపేట ఎస్‌ఐ గారికి తెలియజేయాలని కోరుతున్నారు.సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 8712657920.