Wednesday, May 6, 2026
Home Blog Page 22

ఆయిల్ పామ్ పంటతో అధిక లాభాలు: కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2టీవీ న్యూస్, మార్చి 17, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా రైతులకు ఆయిల్ పామ్ పంట లాభదాయకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మంగళవారం పాపన్నపేట మండలం గాంధారిపల్లి గ్రామంలో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పంటలను ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన కలెక్టర్, పంట సాగు విధానం, దిగుబడి పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తే ఆయిల్ పామ్ ద్వారా అధిక లాభాలు సాధ్యమని సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలను రైతులు వినియోగించుకోవాలని ఆమె అన్నారు. జిల్లాలో 2,500 ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటికే 2,000 ఎకరాల్లో సాగు జరుగుతోందని తెలిపారు.అలాగే ఆయిల్ పామ్ సాగు పరిశీలన కోసం ఈ నెల 20, 21, 22 తేదీలలో సిద్ధిపేట జిల్లాకు 70 బస్సుల్లో మెదక్ రైతులను పంపిస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

దర్శకులు డా. పీసీ ఆదిత్య కు పొట్టి శ్రీరాములు స్మారక పురస్కారం

0

ఏ2టీవీ న్యూస్, మార్చి17, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ప్రత్యేక రాష్ట్రము కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్బంగా హైదరాబాద్ కు చెందిన భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ నిత్య ప్రయోగ శీలి, సినీ దర్శకుడు డా. పీసీ ఆదిత్య కు ప్రతిష్టత్మాక పొట్టి శ్రీరాములు స్మారక పురస్కారం అందజేశారు. ఈ సందర్బంగా సంస్థ నిర్వాకులు దాసరి మహేష్ మాట్లాడుతూ గత 30సంవత్సరాలనుండి సినీ రంగం లో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఎందరో కొత్త వారికి అవకాశాలు ఇస్తున్న దర్శకుడు పీసీ ఆదిత్య కు ఈ అవార్డు ఇవ్వడం మా సంస్థ కు గర్వం గా ఉందన్నారు. అవార్డు గ్రహీత డా. పీసీ ఆదిత్య స్పందిస్తూ అమరజీవి అవార్డు అందుకోవడం సంతోషం గా ఉందనీ, భవిష్యత్ లో పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలు తో ఓ డాకుమెంటరీ ఫిల్మ్ తీస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆదిత్య అభిమానులు మిత్రులు అభినందనలు తెలిపారు.

నర్సాపూర్ లో వడగళ్ళ వాన

0

ఏ2టీవీ న్యూస్,మార్చి16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము).

మెదక్ జిల్లా డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో సోమవారం సాయంత్రం భారీ వడగళ్ల వాన కురిసింది. వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణలో బలమైన గాలులతో వర్షం పడే అవకాశం ఉందని సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నర్సాపూర్ పట్టణం లో సాయంత్రం భారీ గాలులతో వడగళ్ల వానతో తడిసి ముద్దయింది. ఇప్పటివరకు అత్యధిక ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలు వాతావరణ ఒక్కసారిగా చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నట్లు అయింది.

పేదలకు డబుల్ బెడ్ రూములు పంపిణీ చేయాలి: జనసేన పార్టీ నాయకులు శాఖమూరి యాదగిరి

0

ఏ2టీవీ న్యూస్,మార్చి16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

నర్సాపూర్ లో బిఆర్ఎస్ హయాంలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూంలు ఇప్పటికీ వృధాగా పడి ఉన్నాయని, వాటిని వెంటనే పేదలకు పంపిణీ చేయాలని నర్సాపూర్ జనసేన పార్టీ నాయకులు శాఖమూరి యాదగిరి స్థానిక ఆర్డిఓ రామకృష్ణకు వినతి పత్రం సమర్పించారు. అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కల నిజం చేయాలన్న సంకల్పంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించిందని అవి ఇప్పటికీ వృధాగానే పడి ఉన్నాయని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అర్హులైన పేదలను గుర్తించి తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నవీన్, మణిదీప్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

పులిమామిడిలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఘన సన్మానం

0

ఏ2టీవీ న్యూస్ మార్చి16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో ఆదివారం నాడు గ్రామ పంచాయతీ కార్మికుల సేవలను గుర్తించి వారిని ఘనంగా సన్మానించారు. గ్రామ పరిశుభ్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికుల పట్ల పాలకవర్గం కృతజ్ఞత చాటుకుంది. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మికులకు శాలువాలు కప్పి గౌరవించారు. కేవలం సన్మానంతోనే కాకుండా, వారి ఆరోగ్యం మరియు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, నిత్యవసర సరుకులు, వంట నూనెలు, సబ్బులు, మాస్కులు, మరియు గ్లౌజులు అందజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సబితా, గ్రామ సర్పంచ్ రావుపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ మద్దూరి రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని వారు ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మంగలి లక్ష్మణ్, అబ్రమైన యశోద, గొర్రె శ్రీహరి, గొర్రె ఎల్లవ్వ, బండ్ల వేణు, తొయేటి కృష్ణ, కొమ్ము కవిత తదితరులు పాల్గొని కార్మికులకు తమ మద్దతును తెలిపారు. గ్రామ అభివృద్ధిలో కార్మికుల శ్రమను గుర్తించి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పోడ్చన్‌పల్లి తండా వద్ద బొమ్మ బొరుసు ఆడుతున్న 10 మంది కేసు నమోదు

0

20,040 నగదు, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం – మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ఏ2టీవీ న్యూస్, మార్చి15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం పోడ్చన్‌పల్లి తండా సమీపంలో బొమ్మా బొరుసు ఆడుతున్న 10 మందిని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా, కొంతమంది వ్యక్తులు జూదం ఆడుతున్నట్లు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో మదారి లింగం, జుకంటి బాబు, జిలకర సాయిలు, వడ్డే సాయిలు, బుచ్చం రాజు, షేక్ రఫీ, గోవింద్ ఆంజనేయులు, తాడేపు సంతోష్, బోడ వినోద్, కొమ్ముల అనిల్ ఉన్నారు. వారి వద్ద నుంచి ₹20,040 నగదు మరియు 10 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పాపన్నపేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, జూదాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జూదం కారణంగా కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు సమాజంలో చెడు ప్రభావం పడుతుందని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ప్రజలను కోరారు. అక్రమ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తారని ఆయన పేర్కొన్నారు.

పులిమామిడిలో ముమ్మరంగా ప్రజాపాలన కార్యక్రమం

0
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; runfunc: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:0; brp_del_th:0.0000,0.0000; brp_del_sen:0.0000,0.0000; motionR: 0; delta:1; bokeh:1; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 13107200;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 35;zeissColor: bright;

ఏ2టీవీ న్యూస్, మార్చి 15,మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి పారిశుద్ధం తదితర పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలో ఎనిమిది వార్డుల గాను ఇప్పటివరకు జెసిబిలతో గుంతలను పూడ్చి రోడ్లు బాగు చేసి పిచ్చి పొదలను తొలగించి గ్రామంలో గల పరిసరాలను శుభ్రపరచారు. ఈ సందర్భంగా సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి అని గ్రామంలోని పరిసరాల పరిశుభ్రతకు, అభివృద్ధికి ప్రజలు తమ వంతు బాధ్యతగా సహకరించాలని కోరారు.

కొల్చారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదంతండ్రి–కొడుకు సహా ముగ్గురు మృతి

0

ఏ2టీవీ న్యూస్, మార్చి 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను హవేలీఘనపూర్ మండలం బూర్గుపల్లికి చెందిన తండ్రి, కొడుకులు అమృత్ గౌడ్ (51), రిషివర్ధన్ గౌడ్ (13)గా, అలాగే భూపతిపూర్‌కు చెందిన సాయి గౌడ్ (32)గా పోలీసులు గుర్తించారు. వీరు కొల్చారం మండలం రంగంపేటలో జరిగిన శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట పోలీసు బందోబస్తు

0

ఏ2టీవీ న్యూస్ మార్చి14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్, శనివారం: జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా పరీక్షలు ప్రశాంతంగా మరియు పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో సర్ధనలోని ప్రభుత్వ పాఠశాల పరీక్షా కేంద్రంతో పాటు మెదక్ పట్టణంలోని సిద్ధార్థ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ పరీక్షా కేంద్రాలను మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో బి ఎన్ ఎస్ సెక్షన్ 163 (పూర్వం 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించినట్లు చెప్పారు. చీటీలు పంపించడం, ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి సామాజిక వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా చేపట్టినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాల రవాణా మరియు పరీక్ష అనంతరం సమాధాన పత్రాల భద్రత కోసం ప్రత్యేక పోలీసు ఎస్కార్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.పరీక్షల ప్రారంభం నుండి ముగింపు వరకు నిరంతర పోలీసు పెట్రోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని, పరీక్షల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక బందోబస్తు కొనసాగుతుందని అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు.

నర్సాపూర్ లో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం

0

ఏ2టీవీ న్యూస్, మార్చి 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో శనివారం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు శాఖమూరి యాదగిరి, కృష్ణవేణి లు జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సహకారంతో జిల్లాలో పార్టీని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదుకు సైతం అపూర్వ స్పందన లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్, లక్ష్మి, కుమార్, గోపి తదితరులు పాల్గొన్నారు.