Thursday, May 7, 2026
Home Blog Page 9

స్నేహితుడిపై దాడి చేసి హత్య.. ఇద్దరికీ జీవిత ఖైదురూ.30,000 జరిమానా విధింపు

0

శిక్ష పడేందుకు కృషి చేసిన సిబ్బందిని అభినందించిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా రామాయంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన స్నేహితుడి హత్య కేసులో ఇద్దరు నిందితులకు జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అదేవిధంగా చెరో రూ.15,000 చొప్పున మొత్తం రూ.30,000 జరిమానా కూడా విధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు.వివరాల్లోకి వెళితే.. డి. ధర్మారం గ్రామానికి చెందిన నరేందర్ తన స్నేహితులు పిట్ల పరుశురాములు, చెవిటోల్ల చంద్రంతో కలిసి తరచూ మద్యం సేవించేవాడు. ఈ క్రమంలో వారిమధ్య తలెత్తిన విభేదాలు తీవ్రరూపం దాల్చి, క్షణిక ఆవేశంలో నిందితులు నరేందర్‌పై దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం మృతదేహాన్ని చెక్‌డ్యాంలో పడేసి ఘటనను దాచిపెట్టేందుకు ప్రయత్నించారు.ఈ ఘటన 2022 మే 4న వెలుగులోకి రావడంతో రామాయంపేట్ పోలీస్ స్టేషన్‌లో అప్పటి ఎస్‌ఐ రాజేష్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి చంద్రశేఖర్ రెడ్డి సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి, సాక్షులను విచారించి నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.ప్రస్తుతం కేసు దర్యాప్తు బాధ్యతలు నిర్వహించిన ఐఓ వెంకట రాజా గౌడ్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ వాదనలు వినిపించారు. సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి నీలిమ నిందితులు నేరం చేసినట్లు నిర్ధారించి ఇద్దరికీ జీవిత ఖైదుతో పాటు చెరో రూ.15,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.ఈ కేసులో కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ భూపాల్ సహకరించారు. నిందితులకు శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు – కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని చెప్పారు.సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా మెదక్, నర్సాపూర్ బస్ డిపోల నుంచి బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మెదక్ డిపో నుంచి 100, నర్సాపూర్ డిపో నుంచి 34 బస్సులు నడుపుతున్నామని వెల్లడించారు. అవసరానికి అనుగుణంగా కొత్తగా కండక్టర్లను నియమించడమే కాకుండా, గతంలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంపిక చేసి వారి సేవలను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల సమన్వయంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రైవేట్ స్కూల్స్, కంపెనీలు సహకరించాలని కోరామని, వారి సహకారంతో అవసరమైన చోట బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.అత్యవసర అవసరాల కోసం 9391942254 కంట్రోల్ రూమ్ నంబర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడిస్తూ, అవసరం ఉన్నవారు సంప్రదించాలని కోరారు. ప్రజల పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఎవరైనా ప్రైవేట్ వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డీపీఆర్ఓ రామచంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.

గవ్వలపల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన తహసిల్దార్

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 21,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి లోని కొనుగోలు కేంద్రాన్ని తాసిల్దార్ మాలతీ మంగళవారం సందర్శించారు. ఆదివారం అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం తాసిల్దార్ మాలతీ మాట్లాడుతూ, మండలంలో కామారం గ్రామంలో 15 మంది రైతులకు సంబంధించిన వరి పంట నష్టం వాటిల్లిందని తమకు సమాచారం అందిందన్నారు. వ్యవసాయ అధికారి తన సిబ్బందితో క్షేత్రస్థాయిలో వెళ్లి పంటలను పరిశీలించి పై అధికారులకు నివేదిక అందిస్తున్నట్లు తెలిపారు. కాగా మరో రెండు రోజులు వర్షాలు ఉన్నందున రైతులు ధాన్యంపై టార్పిన్ కప్పాలని సూచించారు. వరి ధాన్యం ఆరబోసి తేమశాతం లేకుండా కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని విక్రయించాలని తెలిపారు. కొనుగోలు నిర్వాహకులు పాల్గొన్నారు.

అనాధ కుటుంబానికి ఆర్థిక సాయం

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 21, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయి ఇద్దరు చిన్న పిల్లల ను పోషించడంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి కామారం తండా సర్పంచ్ హలావత్ మోహన్ నాయక్, పంచాయతీ సెక్రెటరీ నాంపల్లి పాలకవర్గ సభ్యులు తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోహన్ నాయక్ తో పాటు సెక్రటరీ స్వర్ణలత ఉప సర్పంచ్ విజయ పాలకవర్గ సభ్యులు మోహన్, చందర్, సుభాష్, శాంతి, సోనియా సుశీల, వినోద్ వారి కుటుంబా సభ్యులు పాల్గొన్నారు.

పిల్లల ఈత సరదా తల్లిదండ్రులకు తీరని దుఃఖంగా మారకూడదు: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు హెచ్చరిక

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 20, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు ఈతకు వెళ్లే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, సూచించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశముందని ఆయన హెచ్చరించారు.నీటి లోతు తెలియకపోవడం, జారి పడటం వంటి కారణాలతో చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని స్పష్టం చేశారు.పిల్లలకు ఈత నేర్పించాలని భావిస్తే, తప్పనిసరిగా తల్లిదండ్రులు లేదా పెద్దల పర్యవేక్షణలోనే నేర్పించాలని సూచించారు. గ్రామాల్లోని బావులు, చెరువుల వద్ద భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. ప్రమాదం జరిగే ముందే జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని, పిల్లల సరదా తల్లిదండ్రులకు జీవితాంతం మిగిలే విషాదంగా మారకూడదని అన్నారు.అదేవిధంగా మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకున్న ఘటనలను గుర్తు చేస్తూ, అటువంటి చర్యలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లు తేలితే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.వేసవి కాలంలో పిల్లలు ఎక్కువ సమయం ఖాళీగా ఉండే పరిస్థితుల్లో, వారిని ఇంట్లోనే ఉంచి చదువు, క్రీడలు లేదా ఇతర సృజనాత్మక కార్యకలాపాల వైపు దారి చూపాలని సూచించారు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ సమిష్టిగా బాధ్యత వహించాలని ఎస్పీ కోరారు.

ఉపాధి కూలీలకు కనీస వసతులు కల్పించాలి:జిల్లా డీఆర్డీవో అధికారి శ్రీనివాసరావు

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 21, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో ఉపాధి హామీ పనులను మెదక్ జిల్లా డీఆర్డీవో శ్రీనివాసరావు ఆకస్మికంగా సందర్శించి కూలీ పనులు చేస్తున్న ప్రదేశం వద్దకు వెళ్లి పరిశీలించారు. కూలీ పనులు చేస్తున్న కూలీలను ఉదయం పూటనే పనులు చేయాలని, మళ్లీ సాయంత్రం పనులు చేయాలని సూచించారు. ఉపాధి కూలీలతో పనుల విషయంలో మాట్లాడారు. పనులు చేస్తున్న ప్రదేశంలో కూలీలకు కనీస వసతులు కల్పించాలని టిఏలు గోపాల్ సంపత్ కు సూచించారు. పని ప్రదేశంలో త్రాగునీరు తప్పనిసరిని ప్రధమ చికిత్స డబ్బా తప్పనిసరనితెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అనురాధ సంపత్ పాల్గొన్నారు.

జనగణనలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల పాత్ర కీలకం: కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 21, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.టేక్మల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జనగణన శిక్షణా కేంద్రాన్ని ఆమె మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ సిబ్బందికి జనగణన విధానం, నియమాలు, బాధ్యతలపై అవగాహన కల్పిస్తున్న తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డేటా సేకరణను ఖచ్చితంగా, పారదర్శకంగా నిర్వహించడం జనగణన విజయానికి ప్రధానమని తెలిపారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు.జనగణనలో ఉపయోగించే 34 పాయింట్లను పూర్తిగా అధ్యయనం చేసి, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలని ఆమె ఆదేశించారు. ఎలాంటి సందేహాలున్నా వెంటనే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, శిక్షణలో పాల్గొన్న సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు – కూరగాయల సాగు వైపు రైతులు మళ్లాలి

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 21, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు పొందవచ్చని, రైతులు సాంప్రదాయ పంటల నుంచి లాభసాటి కూరగాయల సాగు వైపు మళ్లాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల పంటలకు సబ్సిడీలు అందిస్తున్నదని ఆమె తెలిపారు.మంగళవారం టేక్మాల్ మండలం చంద్రు తండాలో కలెక్టర్ పర్యటించి, 256 మంది రైతులు సాగుచేస్తున్న కూరగాయల పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను అభినందించారు.కలెక్టర్ మాట్లాడుతూ, రైతు కష్టాన్ని నమ్ముకుని పనిచేసే వాడని, “రైతే దేశానికి వెన్నుముక” అనే నినాదానికి చంద్రు తండా నిదర్శనమని పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతూ, లాభసాటి కూరగాయల సాగుతో రైతు కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం హర్షణీయమన్నారు.టమాటా, కాకర, చిక్కుడు, సొరకాయ వంటి కూరగాయలను సేంద్రియ ఎరువులతో పండించడం వల్ల పంటలు ఆరోగ్యవంతంగా పెరిగి, నాణ్యమైన ఉత్పత్తి లభిస్తోందని తెలిపారు. రైతులు స్వయంగా మార్కెట్‌కు వెళ్లి తమ పంటలను విక్రయిస్తూ మంచి లాభాలు పొందుతున్నారని చెప్పారు.ప్రభుత్వం ద్వారా సబ్సిడీతో స్ప్రింక్లర్లు అందజేస్తున్నామని, వ్యవసాయ అధికారులు రైతులకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకాలు అందించడం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో కొత్త పద్ధతులను అవలంబిస్తున్న రైతులు ఇప్పుడు లాభాల బాట పట్టారని, అనేక మంది సాగును లాభసాటి వ్యాపారంగా మార్చుకుంటున్నారని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, సర్పంచి స్రవంతి సర్దార్, మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్, ఏఈఓ వినోద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా పాలన ప్రగతి లో భాగంగా సంక్షేమంలో విద్యార్థులకు…

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 21, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శంకరంపేట రా నందు కాంప్లెక్స్ స్థాయి క్విజ్ కార్యక్రమం కాంప్లెక్స్ పరిధిలోని 5వ తరగతి చదువుతున్న 10 పాఠశాలల విద్యార్థులకు క్విజ్ కార్యక్రమం అత్యంత ఆసక్తిగా నిర్వహించడం జరిగింది.ఈ క్విజ్ కార్యక్రమంలో పరిసరాల విజ్ఞానం, గణితం అనే విషయాలపై విద్యార్థులకు ప్రశ్నించి వారి యొక్క స్థాయిని తెలుసుకోవడం జరిగింది.ప్రతి నెల ఇదేవిధంగా విద్యార్థుల్లో పోటీ తత్వం మరియు విషయ అవగాహన పెంచుకోవడం కోసం ఆరోగ్య పూర్వక వాతావరణం లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించుటకు నిర్ణయించనైనది.విద్యార్థులు అందరూ క్విజ్ కార్యక్రమంలో పాల్గొని పోటాపోటీగా జవాబులు చెప్పి కార్యక్రమ వాతావరణo ఆసక్తికరం చేయడం జరిగింది. పోటీలో పాల్గొన్న విద్యార్థుల్లో ప్రాథమిక పాఠశాల శంకరంపేట రా విద్యార్థులు ప్రథమ స్థానం పొందగా ఎంపీపీ ఎస్ మల్లుపల్లి విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని పొందడంజరిగింది.విద్యార్థులు ఉపాధ్యా యులందరికీ మధ్యాహ్న భోజనాన్నిఅందించడంతోపాటుప్రతిపాఠశాలలోసంగ్రహణాత్మకమూల్యాంకనంలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతిని అందజేయడం జరిగింది. మరింత పట్టుదలతో రాబోయే కార్యక్రమాల్లో పాల్గొనాలని మండల విద్యాశాఖ అధికారి దీప్లా రాథోడ్ విద్యార్థులకు సూచన చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎస్సీ ఎస్టీ వసతి గృహాలను పరిశీలించిన ఎంపీడీవో దామోదర్

0

చిన్నశంకరంపేటలో ప్రజా పాల న ప్రగతి పాలన సంక్షేమంలో భాగంగా ఎస్సీ ఎస్టీ వసతి గృహాలను కనిపిస్తున్న ఎంపీడీవో దామోదర్

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 21, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మొదటి రోజు సంక్షేమ వారంలో భాగంగా గిరిజన వసతి గృహాన్ని, ఎస్సీ వసతి గృహాన్ని సోమవారం సందర్శించి హాస్టల్లో ఉన్న శానిటేషన్ వర్క్, టాయిలెట్స్, వంట గదులను, విద్యార్థులు ఉండే గదులను ఎంపీడీవో దామోదర్ పరిశీలించారు. విద్యార్థులకు మేనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? వచ్చే సంవత్సరం వసతి గృహంలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని వార్డేన్లకు సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని చెట్లను విరిగా నాటాలని సూచించారు.