Thursday, May 7, 2026
Home Blog Page 10

మెదక్ జిల్లాకు కొత్త అదనపు ఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్ బాధ్యతలు స్వీకారం

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 20, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి బదిలీపై ఆదివారం మెదక్ జిల్లాకు వచ్చిన అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, గారికి జిల్లా పోలీస్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గార్డ్ ఆఫ్ ఆనర్‌ను ఆయన స్వీకరించారు. అనంతరం అధికారులు పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా అభినందనలు తెలిపారు.తదనంతరం ఆయన జిల్లా పోలీస్ అధికారులతో సమావేశమై, జిల్లాలోని శాంతిభద్రతల పరిస్థితులపై సమగ్ర సమాచారం తెలుసుకున్నారు. ప్రజల భద్రత, చట్టసంరక్షణలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

సంగాయిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 20, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ని చెప్పి పేట గ్రామం సామాగ్ ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం నరసాపురం ఎమ్మెల్యే లాంచ్ అన్నంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతు పరస్పర సహకార సమాఖ్య సంఘం చైర్మన్ వెంకట్ రెడ్డి, తాసిల్దార్ శ్రీనివాస్ చారి ఎంపీడీవో ఉన్నిసా బేగం ,సర్పంచ్ పుర్ర కాంతమ్మ ప్రభాకర్, మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్, మండల యువత అధ్యక్షులు కోలాపూర్ సంతోష్ రావు, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, జిల్లా రేషన్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభాకర్ గుప్తా,నాయకులు కరెంటురాజా గౌడ్, నరేందర్ రెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

2027 డిజిటల్ జనగణనపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 20, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

2027లో పూర్తిగా డిజిటల్ విధానంలో జనగణన నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జనగణన విజయవంతం కావాలంటే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు శిక్షణలో సంపూర్ణ అవగాహనతో పాల్గొనాలని సూచించారు.కౌడిపల్లి మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జనగణన–2027 నిర్వహణలో భాగంగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డిజిటల్ జనగణనకు సంబంధించిన ప్రతి అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని, శిక్షణలో చెప్పే విషయాలను జాగ్రత్తగా గ్రహించాలని సూచించారు. ఈ శిక్షణ మూడు రోజులపాటు కొనసాగుతుందని, ఇందులో ప్రశ్నలు–సమాధానాల రూపంలో జనగణనకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తున్నట్లు తెలిపారు.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

0

కొల్చారం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం.. ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 20, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సూచించారు. సోమవారం కొల్చారం మండలంలోని వరిగుంతం, రంగంపేట, పైతర తదితర గ్రామాల్లో పిఎసిఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు.ప్రభుత్వ కేంద్రాలనే వినియోగించుకోవాలి:ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ ప్రయోజనాలను పొందాలన్నారు.ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ:అనంతరం పైతర మరియు కోనాపూర్ గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు ఎమ్మెల్యే సునీతమ్మ భూమిపూజ నిర్వహించారు. పేదల సొంతింటి కల నర్సాపూర్ నియోజకవర్గంలో సాకారం అవుతోందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.పాల్గొన్న ముఖ్య నేతలు, అధికారులు:ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసాచారి, ఎంపీడీవో ఉన్నిసా బేగం, మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా, మండల యువత విభాగం అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రవితేజ రెడ్డి (పైతర), సర్పంచులు అరిగే స్వర్ణలత విజయకుమార్ (రంగంపేట), మోతుకు నిర్మల మల్లేశం (కోనాపూర్), దొడ్లే ఆంజనేయులు (తుక్కాపూర్), కోరబోయిన లక్ష్మీపెంటయ్య (పెనుగండ్ల), యోహాన్ (వరిగుంతం) పాల్గొన్నారు.అలాగే వార్డు మెంబర్ పోలంపల్లి నర్సింహులు, నాయకులు బక్కప్ప, పుష్క మల్లేశం, ఉష్క సుధాకర్, మాజీ సిడిసి చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ జడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్, ఉపసర్పంచులు చిట్కుల సురేష్, రవీందర్, మాజీ సర్పంచులు భాను ప్రకాష్ రెడ్డి, మురళి గౌడ్, ఎల్లేశం, నాయకులు రామచందర్, రాజా గౌడ్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

పేదోని సొంతింటి కళ నెరవేర్చింది.

0

–ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎంపీడీవో దామోదర్

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 19, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారిని మొదటి ప్రాధాన్యతగా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. చిన్నశంకరం పేట మండలంలో 549 ఇండ్లు మంజూరు కాగా 32 ఇండ్లు పూర్తికాగా 439 ఇండ్లు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయి. పూర్తి కాబడిన 32 ఇండ్లు లో లబ్ధిదారులు సోమవారం గృహప్రవేశాలు పొందగా చిన్నశంకరంపేటలో గేట్ మీది సురేష్-మౌనిక దంపతుల ఇందిరమ్మ ఇంటిలో గృహప్రవేశం పొందారు. అలాగే రుద్రారం గ్రామాలలో హేమలత ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు పొందారు. అనంతరం ఎంపీడీవో దామోదర్ మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారంలోఈగృహప్రవేశాల ప్రారంభోత్సవాలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపివో వినోద్, సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్, ఆకుల సంతోషి నవీన్, ఈవో ప్రదీప్ ,మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, రమేష్ గౌడ్, హాజరుకాగా ఎంపీడీవో దామోదర్ ఇందిరమ్మ ఇండ్ల ను ప్రారంభించారు.

నష్టపోయిన పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 20, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

ఆదివారం కురిసిన అకాల వర్షానికి మండలంలోని కామారం గ్రామంలో దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయ అధికారి లక్ష్మి ప్రవీణ్ విస్తీర్ణ అధికారులు సోమవారం పంటలను పరిశీలించారు. అలాగే రోడ్డుపై కొనుగోలు కేంద్రాలలో నీ తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించగా 15 మంది రైతుల పది ఎకరాల పంట నష్టమైందని అంచనా వేసినట్లు వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ తెలిపారు. నష్టపోయిన పంట వివరాలను పై అధికారులకు పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేటట్లు చూస్తామని రైతులకు తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 20, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొర్వి సురేష్ తోపాటు మరో 50 మంది సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో పార్టీలో చేరడం చేరగా వారికి కండువా కప్పి స్వాగతించారు. వారు మాట్లాడుతూ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పరిపాలన తీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు అంజా గౌడ్ , మండల పార్టీ అధ్యక్షులు సానసత్యనారాయణ,శంభుని రాజకుమార్ గౌడ్, పోతరాజు రమణ, బోయిని ప్రభాకర్, గొల్ల నరేష్ ,తదితరులు పాల్గొన్నారు.

గవ్వలపల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభం

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 20, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

సోమవారం చిన్న శంకంపేట మండలం గవ్వల పల్లి లో ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ భూపాల సిద్ధిరాములు, ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించాలని ఉద్దేశంతో గ్రామ గ్రామాన వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈ కేంద్రాలలోనే వరి ధాన్యం రైతులు విక్రయించి మద్దతుగా పొందాలని సూచించారు. కానీ దళాలను నమ్మి వరి ధాన్యాన్ని అమ్మరాదని, మద్దతుల పొందాలంటే వరి కొనుగోలు కేంద్రాలను వరి ధాన్యం విక్రయించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, యాదవ రావు, ఐకెపి సిసి రాజు, గోవింద్, వివో శశిరేఖ యాదగిరి పాల్గొన్నారు.

బసవేశ్వర జయంతోత్సవం ఘనంగా నిర్వహణ

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 20, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో బసవేశ్వర 893వ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వృత్తిని దైవకార్యంగా భావించి కష్టపడి పనిచేయడం నిజమైన దేశభక్తి అని బసవన్న గారి సందేశం నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు. బసవేశ్వరుడు సాంప్రదాయ సమాజంలో కుల, మత భేదాలకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడు అని పేర్కొన్నారు. మానవతా విలువలను ఆచరణలో పెట్టడం ద్వారా ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి కలెక్టర్ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ మెదక్ జిల్లా అధ్యక్షుడు లింగన్న, మల్లప్ప (గౌరవ అధ్యక్షుడు), పి.డి ఆనందం (జిల్లా జనరల్ సెక్రటరీ), వీరేశం (కోశాధికారి), ప్రభు కుమార్ శెట్టి, శ్రీకాంత్, నత్తటి సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మూడు రోజుల్లో యువకుని వివాహం….కుక్కను తప్పించబోయి చెట్టుకు ఢీకొని యువకుడు మృతి

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 19, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

కుక్కను తప్పించబోయి చెట్టుకు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన పడాల విట్టల్-లక్ష్మి దంపతుల కుమారుడు వరప్రసాద్ (30). తన వివాహం ఈనెల 23న ఉన్నందున వివాహ పత్రికలు బంధువులకు ఇచ్చేందుకు తన స్కూటీపై చిన్న శంకరంపేట నుండి మెదక్ వెళ్ళుతుండగా, అంబాజీపేట గ్రామ శివాల్లో స్కూటీ కి కుక్క అడ్డం రాగా కుక్కను తప్పించబోయి చెట్టుకు ఢీకొని తీవ్ర గాయాలు కాగా, సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి తీవ్రంగా గాయపడ్డ వరప్రసాద్ ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానిక ఎస్సై నారాయణ గౌడ్ తెలిపారు. కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.