Thursday, May 7, 2026
Home Blog Page 12

మెదక్‌లో రోడ్డు భద్రతా చైతన్య రథం ప్రారంభం

0

“ప్రతి ప్రయాణం సురక్షితం కావాలి” – జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 18, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

రోడ్డు ప్రమాదాల నివారణకు మెదక్ జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా కార్యక్రమం కింద శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో చైతన్య రథాన్ని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రారంభించిన చైతన్య రథం జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించనుంది. ముఖ్యంగా జనసంచారం అధికంగా ఉండే జంక్షన్‌లు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటడం, వాహనాల మధ్య సురక్షిత దూరం పాటించడం, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించడం వంటి అంశాలపై ప్రజలకు వివరణ ఇవ్వనున్నారు. అదే సమయంలో సెల్‌ఫోన్‌తో డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్‌లో ప్రయాణం, ఓవర్‌లోడింగ్ వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని పూర్తిగా కుదిపేసే ప్రమాదమని పేర్కొన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం ప్రాణరక్షణకు అత్యవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. అవగాహనతో పాటు నియమాల అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఏఆర్ డీఎస్పీ రంగనాథ్, సీఐలు మహేష్, జార్జ్, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, ఆర్‌ఐలు శైలేందర్, రామకృష్ణ, ఎస్‌ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

మశిక్షణ, సమయపాలన ప్రతి పోలీసుకు తప్పనిసరి: ఏఆర్ డీఎస్పీ రంగా నాథ్

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 18, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఈ రోజు నిర్వహించిన పరేడ్ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీ రంగా నాథ్ గారు పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో పాటు సమయపాలనను కచ్చితంగా పాటించాలని సూచించారు. శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, చట్టాలపై పూర్తి అవగాహన కూడా అవసరమని ఆయన పేర్కొన్నారు. “చట్టం అందరికీ సమానం” అనే సిద్ధాంతాన్ని కచ్చితంగా అమలు చేయాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు.విధుల నిర్వహణలో చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ జర్జ్, ఆర్ఐలు శైలందర్, రామకృష్ణ, ఎస్ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామ పాలన నిబంధనల ప్రకారం కొనసాగాలి: మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 17, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్, శుక్రవారం: పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలని, ప్రతి సర్పంచ్ గ్రామానికి నాయకుడిగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామాల్లో త్రాగునీటి సమస్యలను పూర్తిగా నిర్మూలించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లకు 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై వర్క్‌షాప్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 15వ ఆర్థిక సంఘం నిధులను సక్రమంగా వినియోగించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. జిల్లాలోని గ్రామపంచాయతీలను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంగన్‌వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు లేని గ్రామాల్లో కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తెలిపారు.ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ సమన్వయంతో గ్రామాల్లో పనులు సవ్యంగా నిర్వహించాలన్నారు. గ్రామాల్లో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఇతర శాఖల అధికారులతో సమన్వయం పెంచాలని సూచించారు.నిధుల వినియోగంలో ఎలాంటి అక్రమాలకు తావులేదని స్పష్టం చేస్తూ, నిధులు సక్రమంగా వినియోగించకపోతే సర్పంచ్‌లు, కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా వేసవికాలంలో త్రాగునీటి కొరత రాకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఈఈ మిషన్ భగీరథ సంపత్ కుమార్, గ్రిడ్ డిఈ నాగభూషణం, డిఎల్పీఓలు సాయి బాబు, తిరుపతి రెడ్డి తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వేసవి కాలంలో దొంగలపై అప్రమత్తంగా ఉండండి – జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 17, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

వేసవి సెలవులు, పెళ్లి ముహూర్తాలు, టూర్లతో ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లే సందర్భాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దొంగలు ఉపయోగించుకునే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు.ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.అనుమానిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలి.ఇంట్లో బంగారం, నగదు ఉంచకుండా బ్యాంక్ లాకర్‌లో భద్రపరచాలి.బీరువా తాళాలు బయట పెట్టి వెళ్లకూడదు.నాసిరకం తాళాలు వాడకూడదు, తలుపులకు సెంటర్ లాక్ పెట్టాలి.ఇంటి ముందు చెప్పులు ఉంచడం, లైట్లు ఆన్‌లో ఉంచడం మంచిది.బయటకు వెళ్తున్న విషయం సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు.నమ్మకమైన వ్యక్తులకు, స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి.ప్రయాణాల్లో అపరిచితుల నుంచి ఆహారం తీసుకోవద్దు.కాలనీలో, ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే భద్రత పెరుగుతుంది.అనుమానం కలిగితే వెంటనే 100 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.

హిందూ సమ్మేళనానికి తరలిరండి హిందూ సమ్మేళ సుశ్రీ స్వామి సునీతానంద సరస్వతి

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్17, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

ఈనెల 19న చిన్న శంకరంపేట పట్టణంలోని సాయంత్రం 4 గంటలకు సోమేశ్వర ఆలయం వద్ద నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి హిందువులు అధిక సంఖ్యలో రావాలని హిందూ సమ్మేళన చిన్న శంకరంపేట పట్టణంలో తెలిపారు. దేశానికి ఆత్మ హిందూ ధర్మం, సంస్కృతం, సమాజం అన్నారు. హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి దేశాన్ని విశ్వ గురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925లో ప్రారంభించబడిందన్నారు. ఈ హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా సుశ్రీ స్వామి సునితానంద సరస్వతి (కన్య గురుకుల మాందాపూర్) ముఖ్య వక్త శ్రీ రామ్ ప్రసాద్ సీనియర్ (ఆర్ఎస్ఎస్ ప్రచారకులు) మహిళవక్త శ్రీ గీత అగర్వాల్ (డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్) వస్తున్నారని తెలిపారు.)వారు మాట్లాడుతూ గడప లోపల కులం గడప దాటడానికి హిందువులం ప్రియ బంధువులం అన్నారు. అనంతరం సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ రంగారావు, తదితరులు పాల్గొన్నారు.

నల్ల బ్యాడ్జిలు ధరించి ఉపాధ్యాయుల నిరసన–తాసిల్దార్ కు టీజీ జెఎసి వినతిపత్రం అందజేత

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్17, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

టిజిఈజేఏసి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కంపౌండ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాగణంల్లో ఓ పక్క విద్యార్థుల బోధనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉపాధ్యాయుల న్యాయ పరమైన డిమాండ్లను కోరుతూ, నల్ల బ్యాడ్జిలను ధరించి శాంతియుతంగా నిరసన చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి,పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అంతే కాకుండా పీఅర్సిలను, డిఎలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.నిరసన కార్యక్రమంలో ఎస్టీయు రాష్ట్ర కార్యదర్శి కర్రే పోచయ్య, శ్రీనివాస్ రెడ్డి, శివ ప్రసాద్, సత్యనారాయణ, రతన్ తోపాటు జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు అందించాలి.

0

–గ్రామస్థాయిలో సమస్యలు గుర్తించాలి

–మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటయ్య

ఏ 2టీవీ న్యూస్, ఏప్రిల్ 16, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని మండల పరిషత్ స్పెషల్ ఆఫీసర్ వెంకటయ్య అన్నారు.ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం మండల సభల ప్రధాన ఉద్దేశంమన్నారు. చిన్న శంకరంపేట మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాసిల్దార్ మాలతీ, ఎంపీడీవో దామోదర్, ఎస్సై నారాయణ గౌడ్ హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎస్ఐ. నారాయణ గౌడ్ మాట్లాడుతూ, అరైవ్- అలైవ్ కార్యక్రమంలో రోడ్డు నియమావళి పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు ఉప సర్పంచ్లు ప్రజా ప్రతినిధులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

మండల సభల ద్వారా ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం: కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ 2టీవీ న్యూస్ ఏప్రిల్ 16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేసి, ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.మండల సమావేశంలో వచ్చిన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, లాభదాయక పంటల ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. అలాగే గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలని తెలిపారు.మహిళా సంఘాల బలోపేతం, స్వయం ఉపాధి అవకాశాల పెంపులో ప్రభుత్వ సహకారం కీలకమని మండల సమాఖ్య సభ్యురాలు పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన గృహాలతో తమ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసాచారి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, ఎంపీడీవో రఫీక్ ఉన్నిసా బేగం, సర్పంచ్ డి.శేఖర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

తుక్కాపూర్ గ్రామ ఇందిరమ్మ ఇళ్ల ద్రోపత్ర అందజేసిన ఎమ్మెల్యే

0

ఏ2టీవీన్యూస్, ఏప్రిల్ 16, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

నర్సాపూర్ నియోజకవర్గంలోని కొల్చారం మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చేతుల మీదుగా బుధవారం తుక్కాపూర్ గ్రామానికి చెందిన పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు దృపత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే చింత లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఉన్నిసా బేగం , మండల అధికారు,సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు తో పాటు ఉపసర్పంచ్ రవీందర్, నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యం గారి సంతోష్ కుమార్ వార్డు సభ్యులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

భవిష్యత్తు లక్ష్యాలు నిర్ధారించుకోండి:జిల్లా విద్యాధికారి విజయ

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 16,చిన్నశంకరంపేట:- ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

భవిష్యత్తు లక్ష్యాలను నిర్ధారించుకొని ఆ వైపుగా ప్రయాణం చేయాలని మెదక్ జిల్లా విద్యాధికారి విజయ అన్నారు. బుధవారం సాయంత్రం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో ఇన్చార్జి మండల విద్యాధికారి దీప్లా రాథోడ్ అధ్యక్షతన పిఎం శ్రీ పాఠశాల స్పోర్ట్స్ వార్షికోత్సవం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాధికారి విజయ హాజరై మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడా రంగాలలో గెలుపొందిన వాలీబాల్ లో కెప్టెన్ నరేందర్, వినయ్, అశ్వత్, మోసిన్ రాష్ట్ర స్థాయికి ఎంపికైన వారికి ప్రశంస పత్రాలు అందించారు. సర్పంచ్లు కంజ్జర్లచంద్రశేఖర్,హళవత్ మోహన్, ఇమ్మడి నరేష్ మాట్లాడుతూ, మీ భవిష్యత్ లక్ష్యాలను నిర్ధారించుకొని ఆ వైపుగా ప్రయాణం చేయాలని విద్యార్థులు ఉద్దేశించి తెలిపారు. మండల విద్యాధికారి దీప్లా రాథోడ్ , ఎస్టీయు రాష్ట్ర కార్యదర్శి కర్రే పోచయ్య లు మాట్లాడుతూ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఎం శ్రీ కింద ఎంపిక అయిందని, ఇందులో కంప్యూటర్ ల్యాబ్ ను, తరగతి గదులను, డిజిటల్ విద్య, ఫర్నిచర్, మరుగుదొడ్లు, అదనపు తదగదులు మధ్యాహ్న భోజనాన్ని వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లుతెలిపారు. లక్ష్యాలనునిర్ధారించుకొని వాటిని సహకారం చేసే విధంగా ప్రయత్నం చేయాలని, విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలని, ఒక సమయపాలన పట్టికను ఏర్పాటు చేసుకొని చదవాలని, మీకు ఏమైనా సబ్జెక్టులలో సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థు ల తల్లిదండ్రులు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.