Thursday, May 7, 2026
Home Blog Page 13

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మనోహరాబాద్ మండలంలోని కలకల్ గ్రామంలో నిర్వహించిన “అరైవ్-అలైవ్” కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు కంటి పరీక్షలు నిర్వహించారు.ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రాణ భద్రతే పోలీస్ శాఖ లక్ష్యమని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చిన్నారులను వాహనాలపై తీసుకెళ్తున్నప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మైనర్ల డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, ఓవర్ స్పీడ్‌పై నియంత్రణ అవసరమని అన్నారు.జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ వాహనదారులు బాధ్యతతో నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని, జాగ్రత్తలే నివారణకు మార్గమన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న వారితో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఎస్పీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మండల సభలకు పకడ్బందీ ఏర్పాట్లు – కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో ఈ నెల 21న నిర్వహించనున్న మండల కేంద్రాలు, మున్సిపాల్టీల సభలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.“ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ”లో భాగంగా జరుగనున్న ఈ సభలకు ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేయాలని గూగుల్ మీట్ ద్వారా సూచించారు. సభ ప్రాంగణాల్లో నీడ, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ లబ్ధిదారుల వివరాలు ప్రజలకు తెలియజేయాలని, గ్రామ సభల అర్జీలను ముందుగానే పరిష్కరించాలని సూచించారు. సభల్లో రాష్ట్ర గేయంతో ప్రారంభం చేసి, “అరైవ్-అలైవ్” కార్యక్రమంపై అవగాహన కల్పించాలని తెలిపారు.వేసవిలో త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేయాలని ఆదేశించారు.అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసేవలు పొందాలని, అవసరమైతే 108 సేవలను వినియోగించాలని సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఏ గ్రామానికి వెళ్లినా… హెల్మెట్.. తప్పనిసరి–వాహనదాలకు రోడ్డు సేఫ్టీ నియమాలు వివరిస్తున్న చిన్నారి విద్యార్థులు –అభినందించిన సర్పంచ్ చెన్నగౌని కృష్ణ గౌడ్

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 15, చిన్నశంకరంపేట:- ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

అన్నలు తండ్రులు ఏ పని మీద అయినా, ఎక్కడికి పోయినా,హెల్మెట్ , సీట్ బెల్టు..తప్పనిసరిగా పెట్టుకొని పోవాలని బుధవారం చిన్నశంకరం పేట మండలంలోని చందాపూర్ పాఠశాలలోని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి రోడ్డుపై వెళ్లే వాహనదారులను ఆపీ ప్లే కార్డులు తీసుకుని రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు రోడ్డు సేఫ్టీ నియమాలు తెలిపారు. వాహనాల నడిపే సమయంలో హెల్మెట్ ధరించండి మద్యం సేవించి వాహనాలు నడపకండి రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాస్తు మీకు ఏమైనా జరిగితే మీ కుటుంబం రోడ్డున పడుతుంది వయసులో ఉన్న మీ పిల్లలు అనాధలుగా మారతారంటూ, రోడ్డు సేఫ్టీ నియమాలపై వాహనదారులకు సూచించారు. వాహనాలపై పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకునే ఆటోలను ఆపి రోడ్డు పద్ధతి నియమాలు పాటించాలని చిన్నారి విద్యార్థులు సూచించడం పట్ల గ్రామ సర్పంచ్ చెన్నాగౌని కృష్ణ గౌడ్, ప్రధానోపాధ్యాయుడు మెతుకు పరమేశ్వర్ రెడ్డి, తోటవ్వ విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు చేసే సూచనలు పలువులని ఆకర్షించింది. రోడ్డు భద్రత నియమాలు ప్రతి గ్రామంలో రోడ్లపై వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పిస్తే చందాపూర్ గ్రామంలో విద్యార్థులు ప్లే కార్డులతో వాహనదారులకు అవగాహన కలిగించడం పట్ల ప్రజా ప్రతినిధులు పలువురు పెద్దలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మనకు ఎల్ నినో ముప్పు తప్పదా…!

0

తప్పదంటున్న శాస్త్రవేత్తలు

వాతావరణంలో విపరీత మార్పులు

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 15, ప్రత్యేక ప్రతినిధి (మల్పర్తిరాంచందర్)

భారతదేశంలో ఎల్ నినో ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చి చెబుతున్నారు. దీంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా వేడెక్కి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం పడి వాతావరంలో విపరీత మార్పులు చేసుకుంటా యని వాతావరణ పరిశోధకులు, శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అసలు ఎల్ నినో అంటే ఏమిటి అనేది ముందు తెలుసుకుందాం. ఈ భూమి మీద అతి పెద్దదైన పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అసాధారణ రీతిలో వేడెక్కడం ఎల్ నినోగా పేర్కొంటారు. ఇది అప్పుడప్పుడు సంభవించే ఒక సహజ వాతావరణ మార్పు. 80, 90 ల దశకంలో కూడా వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. కాకపోతే అప్పుడు అటవీ విస్తీర్ణం తగినంత ఉన్నందున పెద్దగా ఆ మార్పులు ఏర్పడలేదు. దీనివల్ల ప్రపంచ గాలుల దిశలు మారి ఋతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ఓవైపు కరువు, ఓవైపు విపరీతమైన వర్షాలు, మరోవైపు విపరీతమైన ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో వేడెక్కడం ఈ ప్రక్రియలో జరిగే మార్పులు. ఎల్ నినో వల్ల ఋతుపవనాలు బలహీనపడి వర్షపాతం తగ్గి కరువు ఏర్పడే పరిస్థితి వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపి ఆహార ఉత్పత్తి తగ్గుతుంది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చేపల వేటపైన ప్రభావం పడుతుంది. వరదల మాటేమో గాని వడగాల్పులు తీవ్రత పెరిగి వాతావరణంలో ఊహించిన మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం మన ఒక్క దేశం వైపే కాదు దక్షిణ అమెరికాలో భారీ వరదలు, ఆసియాలో కరువు వచ్చే అవకాశం ఉన్నందున వాతావరణం అల్లకల్లోలం కానునందున ఇప్పటినుండే సిద్ధంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఎల్ నినో ప్రభావం మన దేశంపై పడనుందని ప్రపంచ వాతావరణ సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. జూలై ఆగస్టులో కరువు పరిస్థితులు ఏర్పడవచ్చనీ, దేశంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు పెరిగాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. 2025 వరకు తటస్థంగా ఉన్న ఈ ఎల్ నినో ప్రభావం 2026 ప్రారంభం నుంచి క్రమంగా బలపడుతుందని, ఈ సంవత్సరం అత్యంత వేడిగా ఉండే సంవత్సరాలలో చరిత్రలో ఒకటిగా నిలబడుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. 2027 వరకు ఇది కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో బోర్లపైనే ఎక్కువ శాతం ఆధారపడతాం కాబట్టి భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో ఇంకా కుండా చూసుకోవాలని జియాలజిస్టులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వాలు కూడా వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని ఆ దిశగా పంటలు సాగు చేసేలా ప్రోత్సహించి కరువు ఏర్పడకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎండలు అధికంగా కొడుతున్నందున ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు.

రోడ్డు సేఫ్టీ నియమాలు పాటించాలి -విద్యార్థులకుప్రయాణికులకు అవగాహణ

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 15,చిన్నశంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

వాహనాల నడిపే సమయంలో హెల్మెట్ ధరించండి,మద్యం సేవించి వాహనాలు నడపకండి,రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మీకేమైనా జరిగితే మీ కుటుంబం రోడ్డున పడుతుంది,మా వయసులో ఉన్న మీ పిల్లలు అనాథలుగా మారుతారు అంటూ, రోడ్డు సేఫ్టీ నియమాలపై ప్రయాణికులకుబుధవారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద విద్యార్థులకు వాహనదాలకు ఎస్సై నారాయణగౌడ్అవగాహణ కల్పించారు. విద్యార్థులు. పాఠశాల విద్యార్థులచే వాహన దారులు రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలిపారు. జాతీయ ప్రధాన రహదారిపై హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడిపే వారిని, సీట్ బెల్ట్ లేకుండా కార్లు,పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకునే ఆటోలను ఆపి రోడ్డు భద్రత నియమాలు పాటించాలని విద్యార్థులు చేసే సూచనలు పలువురిని ఆకర్షించింది. వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

ముట్రాజ్ పల్లి లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు సర్పంచ్ సాలె పద్మ వెంకటేశం

0

ఏ2టీవీ న్యూస్ ,ఏప్రిల్ 15, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ముట్రాజ్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ సాలె పద్మ వెంకటేశం అధ్యక్షతన ఘనంగా బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అంబేద్కర్ చెప్పినప్పుడు దానికి పూలను వేసి కొబ్బరికాయ కొట్టి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం అంబేద్కర్ అమర్ అయాన్ తో నినాదాలు చేశారు. సర్పంచ్ సాలె పద్మ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గొప్ప మహనీయుడని ఆయన బాటలో యువత నడిచి భావితరాలకు పునాదిగా నిలవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు యువకులు ప్రజలు పాల్గొన్నారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొల్చారం మండలంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహణ

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 15, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పేట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆరైవ్ అలైవ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో గ్రామ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు పలువురు నాయకులు , ప్రజలు పాల్గొనగా పోలీస్ సిబ్బంది రోడ్డు ప్రమాదాలపై అవగాహనలో భాగంగా గ్రామంలోని ప్రతి ఒక్కరు వాహనాలు చిన్నపిల్లలకు ఇవ్వకూడదని అలాగే అతివేగం గా వెళ్ళరాదని ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించడం అత్యంత ముఖ్యమైన విషయమని ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు కలిగే విజయ్ నీలకంఠ ప్రసాద్ ఉషికే సుధాకర్ ఫీల్డ్ అసిస్టెంట్ అంగన్వాడి కార్యకర్తలు అల్లూరు ప్రభుత్వ సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.

మానవ తప్పిదాలే… మరణాలు

0

–యువత తలుచుకుంటే సాధించేది లేదు

–అంబేద్కర్ సమావేశంలో పాల్గొన్న డీఎస్పీ నరేందర్ గౌడ్.

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 15, చిన్నశంకరంపేట (ప్రతినిధి కమ్మరి దేవరాజు)

ప్రపంచాన్ని కదిలించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ అన్నారు.135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని రాత్రి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించిన అనంతరం అక్కడే అంబేద్కర్ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తి గళ్ళ రామచంద్రం డీఎస్పీ నరేందర్ గౌడ్,ఎస్సై నారాయణ గౌడ్ పాల్గొన్నారు. సమావేశంలో వారు మాట్లాడారు. భారతదేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నామంటే అంబేద్కర్ అడుగడుగునా అవమానాలకు గురైనప్పటికీ ఆయన రచించిన రాజ్యాంగం వలనే ఈరోజు భారతదేశంలోని ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నట్లు తెలిపారు. సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్, ఎస్సై నారాయణ గౌడ్ మాట్లాడుతూ యువకులు ప్రతి ఒక్కరు చదువుకోవాలని సూచించారు. రోడ్డు పద్ధతి నియమాలు పాటించాలని, డగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు యువత దూరం ఉండాలని, ప్రతి ఒక్కరు చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మురళి మాదిగ, దళిత సంఘాల నాయకులు తదిత నాయకులు ఉన్నారు.

పులిమామిడి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

0

– భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన యువత

– పాల్గొన్న సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్135వ జయంతి వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. నివాళులర్పించిన సర్పంచ్ మరియు గ్రామస్తులు గ్రామ సర్పంచ్ రావి పల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ యూత్ మరియు గ్రామ యువత కలిసి గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జై భీమ్ నినాదాలతో పులిమామిడి పురవీధులు మారుమోగాయి.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లనే నేడు అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతోందని, ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ వేడుకల్లో గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అంబేద్కర్ యూత్ సభ్యులు,మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మనోహరాబాద్‌లో ఘనంగా డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 14, మనోహరాబాద్ ప్రతినిధి (రామకృష్ణ)

మనోహరాబాద్ మండల వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో దళిత సంఘాలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.మండలంలోని మనోహరాబాద్, కొండాపూర్, జీడిపల్లి, ముప్పిరెడ్డిపల్లి, గౌతోజీగూడా తదితర గ్రామాల్లో వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. నీలి జెండాలతో గ్రామాలు కళకళలాడగా, అంబేద్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి ఘనంగా స్మరించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, “భారత రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. విద్య ద్వారా ఉన్నత స్థానాలకు ఎదిగి సమాజ అభివృద్ధికి తోడ్పడాలి” అని పేర్కొన్నారు.కార్యక్రమాల్లో మండల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, దళిత సంఘాల నేతలు, యువత పాల్గొన్నారు. పూలమాలలు వేసి నివాళులర్పించడం, మిఠాయిల పంపిణీ, అంబేద్కర్ జీవితం గురించి చర్చించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.మండల వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు పండుగ వాతావరణంలో ఎలాంటి లోటు లేకుండా విజయవంతంగా ముగిశాయి.