Thursday, May 7, 2026
Home Blog Page 18

కోనాపూర్‌లో ఘనంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 5, నర్సాపూర్ నియోజకవర్గం ప్రతినిధి (పద్మ బిక్షపతి)

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కోనాపూర్ గ్రామంలో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ మోతుకు నిర్మల మల్లేశం మరియు ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. కేక్ కటింగ్: గ్రామ నడిబొడ్డున కార్యకర్తలు, నాయకుల మధ్య ఎమ్మెల్యే జన్మదిన కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షల వెల్లువ: నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే చూపిస్తున్న చొరవను కొనియాడుతూ, ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ (టిఆర్ఎస్) అధ్యక్షులు, మాజీ సర్పంచ్, మాజీ ఉపసర్పంచ్ తో పాటు పార్టీ కార్యకర్తలు, యూత్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మిఠాయిలు పంపిణీ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఘనంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 5 నర్సాపూర్ ప్రతినిధి (రామ్ చందర్)

నర్సాపూర్ ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి జన్మదినోత్సవాన్ని స్థానిక నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకరిమెట్లు శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలునిర్వహించి ఆమెకు ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం నర్సాపూర్ లోని క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు పండ్లు పంచడం జరిగింది. ఈకార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఘనంగా ఎమ్మెల్యే సునీత రెడ్డి జన్మదిన వేడుకలు.. ఉప సర్పంచ్ చిట్కుల సురేష్

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 5 నర్సాపూర్ నియోజకవర్గం ప్రతినిధి (పద్మ బిక్షపతి)

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన రంగంపేటలో స్థానిక బస్టాండ్ మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారి ప్రక్కన స్థానిక నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు ఉప సర్పంచ్ చెట్ల సురేష్ అధ్యక్షతన కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోపి గారి సత్య గౌడ్, అరిగే విజయ్ కుమార్, కోరంపల్లి బక్కప్ప, ఉషికే మల్లేశం, గోకరి నరసింహ గౌడ్ , గుండెల ఆంజనేయులు, రవీందర్ గౌడ్, మహేష్ గౌడ్, గామని గంగారంలు, గామని కృష్ణ, బెస్త నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

0

ఏ2టీవీన్యూస్, ఏప్రిల్ 5, నర్సాపూర్ ప్రతినిధి (రామ్ చందర్)

డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు శాఖమూరి యాదగిరి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరువలేనివని, ముందు తారాలకు ఎంతో ఆదర్శమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తొంట అశోక్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

చౌక దుకాణాల పనితీరు ఆదర్శం: కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 5,మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా: జిల్లాలోని చౌక ధరల దుకాణాల పనితీరు ఆదర్శవంతంగా ఉందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) ద్వారా లబ్ధిదారులకు ప్రయోజనాలు సమర్థవంతంగా, పారదర్శకంగా చేరేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న 520 రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్) సరుకులు పారదర్శకంగా పంపిణీ జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ సరఫరా కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజలు ఎలాంటి వదంతులు, అసత్య ప్రచారాలు నమ్మకుండా ప్రశాంతంగా తమకు లభ్యమయ్యే రేషన్ సరుకులను పొందాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పత్తి నగర్ ప్రాంతంలో ఉన్న షాప్ నంబర్-04 చౌక ధరల దుకాణాన్ని ఆదివారం కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, పౌర సరఫరాల ఇన్స్పెక్టర్ నరసింహులు, సిబ్బంది నాగరాజుతో కలిసి ఆమె స్టాక్ వివరాలు, తూకాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.లబ్ధిదారులతో మాట్లాడిన కలెక్టర్, ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువులు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ, సివిల్ సప్లై శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సునీతమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా – తుక్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహణ

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 5, నర్సాపూర్ నియోజకవర్గం ప్రతినిధి (పద్మ బిక్షపతి)

ఆదివారం మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో నర్సాపూర్ శాసనసభ్యులు సునీతా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు ఉపసర్పంచ్ రవీందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ దొడ్లే ఆంజనేయులు మాట్లాడుతూ..పేదల పాలిటి పెన్నిధి మనసున్న మహారాణి సునీతమ్మ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అలాగే ప్రజాసేవలో ముందు ముందు ఎన్నో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఈ శుభ సమయంలో కోరుచున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు పలువురు వార్డు మెంబర్లు, కార్యకర్తలు భారీగా పాల్గొనడం జరిగింది

5న నర్సాపూర్ లో జాబ్ మేళా

0

ఏ2టీవీన్యూస్, ఏప్రిల్ 4, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రామ్ చందర్)

ఈనెల 5న డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. వెల్దుర్తి రోడ్ లోని సాయి కృష్ణ ఫంక్షన్ హాల్ లో ఈ జాబ్ మేళా ఉంటుందని, సుమారు 25 ఆయా కంపెనీలు పాల్గొని 1000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పదవ తరగతి నుండి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తదితర విద్యను అభ్యసించిన విద్యార్థులు తమ బయోడేటా తో సర్టిఫికెట్లతో ఈ జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు. ఇట్టి అవకాశాన్ని నర్సాపూర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతి,యువకులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.

నెలవారీ తనిఖీ… ఈవీఎం గోదాం పరిశీలించిన జిల్లా కలెక్టర్

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 4 మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో నిర్వహిస్తున్న నెలవారీ తనిఖీల కార్యక్రమంలో భాగంగా, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం (ఈవీఎం) గోదాంను పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.గోదాంలో భద్రపరచిన ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, అగ్ని ప్రమాద నివారణ చర్యలు, డబుల్ లాక్ సిస్టమ్ వంటి అంశాలను కలెక్టర్ సవివరంగా పరిశీలించారు. గోదాం వద్ద విధులు నిర్వర్తిస్తున్న భద్రతా సిబ్బంది పనితీరును కూడా సమీక్షించారు.ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడటానికి ఈవీఎంల భద్రత అత్యంత కీలకమని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. గోదాంలో అమలు చేస్తున్న భద్రతా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు.ఈ తనిఖీలో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా గోదాంలో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం– జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 3, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా కేంద్రంలో దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, వెనుకబడిన తరగతుల సహాయ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, సంఘ నాయకులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహానుభావుడని తెలిపారు. అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడిగా ఆయన చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు.కొమురయ్య చూపిన ధైర్యం, త్యాగం, పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకమని ఆమె అన్నారు. ప్రజల హక్కులు, సమానత్వం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినవారమవుతామని చెప్పారు.మహనీయులను కులం, వర్గం అనే పరిమితుల్లో చూడకుండా వారి ఆశయాలను అందరూ ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

99 రోజుల ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లాలో గ్రామసభలు ఘనంగా నిర్వహణ

0

ఏ2టీవిన్యూస్ ఏప్రిల్ 3, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ :(2) మెదక్ జిల్లా వ్యాప్తంగా 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజా పాలన గ్రామసభలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో ప్రత్యేక అధికారి రషీద్ ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభలు, తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ గ్రామీణ పథకాల ప్రాముఖ్యత మరియు పథక లబ్ధిదారుల పేర్లు గ్రామ సభలో తెలుపుట గురించి గ్రామ సభ సజావుగా కొనసాగింది. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. గ్రామస్థుల సమస్యలు, అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చలు నిర్వహించగా, ప్రజల అభిప్రాయాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామ అభివృద్ధి పనుల పురోగతిపై గ్రామసభలో సమగ్రంగా విశ్లేషణ జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజల సహకారం ఉంటేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గ్రామస్థులు చురుకుగా పాల్గొని తమ సమస్యలను వెల్లడించడంతో పాటు, పరిష్కారాలపై విలువైన సూచనలు అందించారు.గ్రామసభలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేశారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రషీద్, పంచాయతీ సెక్రెటరీ సబిత, గ్రామ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ మద్దూర్ రాజు, వార్డు సభ్యులు మంగలి లక్ష్మణ్, బండ్ల వేణు, తోయేటి రాధాకృష్ణ, గొర్రె శ్రీహరి, అబ్రమైన యశోద, కొమ్ము కవిత, గొర్రె ఎల్లవ్వ, ప్రజా ప్రతినిధులు, మహిళ సంఘాలు, యువజన సంఘాలు, గ్రామ పెద్దలతో పాటు తదితరులు పాల్గొన్నారు.